మస్కట్ లో వృద్ధుల కోసం OMR 1.2 మిలియన్లతో డే కేర్ సెంటర్ నిర్మాణం
- July 29, 2023
మస్కట్: "ట్రిప్ టు డాక్" కంపెనీతో మస్కట్ గవర్నరేట్లో OMR 1.2 మిలియన్ల పెట్టుబడితో "వృద్ధుల కోసం డే కేర్ సెంటర్" అనే ప్రాజెక్ట్ను స్థాపించడానికి సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MoSD) అవగాహన ఒప్పందం (MOU) పై సంతకం చేసింది. ఈ ప్రాజెక్ట్ వృద్ధులకు సేవలను అందిస్తుంది. వారి సామాజిక, ఆరోగ్యం, వినోద మరియు మానసిక సేవలను అధిక నాణ్యతతో కూడిన సురక్షితమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. ఈ మెమోరాండంపై మంత్రిత్వ శాఖ పక్షాన సామాజిక అభివృద్ధి మంత్రి హర్ ఎక్సలెన్సీ డాక్టర్ లైలా బింట్ అహ్మద్ అల్-నజ్జర్, కంపెనీ పక్షాన కంపెనీ సీఈఓ గ్రైగోస్ టైలోస్ సంతకం చేశారు.
సాంఘిక అభివృద్ధి మంత్రిత్వ శాఖలోని వృద్ధుల వ్యవహారాల విభాగం డైరెక్టర్ సాఫియా బింట్ ముహమ్మద్ అల్-అమిరి మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ మస్కట్ గవర్నరేట్లోని సామాజిక అభివృద్ధి రంగంలో వ్యూహాత్మక పెట్టుబడి ప్రాజెక్టులలో ఒకటని, దీని ద్వారా హక్కులు లభిస్తాయన్నారు. వృద్ధులకు వారి పరిస్థితులకు అనుగుణంగా సురక్షితమైన వాతావరణాన్ని అందించడం ద్వారా మరియు వృద్ధాప్యంలో వారి మానసిక సమస్యలను తగ్గించడానికి ఇది దోహదం చేస్తుందన్నారు.
తాజా వార్తలు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!
- 1,000 కి పైగా ఇరానియన్ దాడులు: యూఏఈ
- అమెరికా కాన్సులేట్ పై డ్రోన్ అటాక్ పై దుబాయ్ క్లారిటీ..!!
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్









