ఆగస్టులో ఉక్రేనియన్ శాంతి చర్చలకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!
- July 31, 2023
జెడ్డా: సౌదీ అరేబియా ఆగస్టు 5, 6 తేదీలలో ఉక్రేనియన్ శాంతి చర్చలకు ఆతిథ్యం ఇవ్వనుంది.ఈ సమావేశాలకు ఇండియా, బ్రెజిల్తో సహా ప్రధాన అభివృద్ధి చెందుతున్న దేశాలను ఆహ్వానిస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ శనివారం తెలిపింది. ఈ సమావేశంలో ఇండోనేషియా, ఈజిప్ట్, మెక్సికో, చిలీ, జాంబియాతో సహా 30 దేశాలకు చెందిన సీనియర్ దౌత్యవేత్తలు ఈ చర్చలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఈ చర్చలు ఉక్రెయిన్కు అనుకూలమైన శాంతి నిబంధనలకు అంతర్జాతీయ మద్దతునిస్తాయని ఉక్రెయిన్, యూరప్ కంట్రీస్ భావిస్తున్నాయి. వీరితోపాటు బ్రిటన్, దక్షిణాఫ్రికా, పోలాండ్ ఈయూ ప్రతినిధులు, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ హాజరవుతారని భావిస్తున్నారు. మే నెలలో ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ జెడ్డాలో అరబ్ లీగ్ సమ్మిట్కు హాజరైనందున సౌదీ అరేబియా చర్చలకు ఆతిథ్యం ఇచ్చింది. ఫిబ్రవరి 2022లో రష్యా ఉక్రెయిన్పై యుద్ధాన్ని ప్రారంభించినప్పటి నుండి అరబ్ దేశాలు చాలా వరకు తటస్థంగా వ్యవహారిస్తున్నాయి.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







