ఆగస్టులో ఉక్రేనియన్ శాంతి చర్చలకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!
- July 31, 2023
జెడ్డా: సౌదీ అరేబియా ఆగస్టు 5, 6 తేదీలలో ఉక్రేనియన్ శాంతి చర్చలకు ఆతిథ్యం ఇవ్వనుంది.ఈ సమావేశాలకు ఇండియా, బ్రెజిల్తో సహా ప్రధాన అభివృద్ధి చెందుతున్న దేశాలను ఆహ్వానిస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ శనివారం తెలిపింది. ఈ సమావేశంలో ఇండోనేషియా, ఈజిప్ట్, మెక్సికో, చిలీ, జాంబియాతో సహా 30 దేశాలకు చెందిన సీనియర్ దౌత్యవేత్తలు ఈ చర్చలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఈ చర్చలు ఉక్రెయిన్కు అనుకూలమైన శాంతి నిబంధనలకు అంతర్జాతీయ మద్దతునిస్తాయని ఉక్రెయిన్, యూరప్ కంట్రీస్ భావిస్తున్నాయి. వీరితోపాటు బ్రిటన్, దక్షిణాఫ్రికా, పోలాండ్ ఈయూ ప్రతినిధులు, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ హాజరవుతారని భావిస్తున్నారు. మే నెలలో ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ జెడ్డాలో అరబ్ లీగ్ సమ్మిట్కు హాజరైనందున సౌదీ అరేబియా చర్చలకు ఆతిథ్యం ఇచ్చింది. ఫిబ్రవరి 2022లో రష్యా ఉక్రెయిన్పై యుద్ధాన్ని ప్రారంభించినప్పటి నుండి అరబ్ దేశాలు చాలా వరకు తటస్థంగా వ్యవహారిస్తున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ ప్రైవేట్ రంగానికి అడ్వైజరీ
- అమరావతిలో 'న్యాయ' మణిహారం: రాజధాని ప్రస్థానంలో మరో మైలురాయి!
- ఇరాన్, గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్
- భారీ నిరసనలు..శ్రీనగర్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత
- ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా అలిరెజా అరాఫీ నియామకం
- ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ
- ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..
- ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ కూడా హతం..!!
- దుబాయ్ లో బంగారం ధరలకు రెక్కలు..!!
- పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది: యూఏఈ









