డబుల్ ఇస్మార్ట్ విషయంలో పూరీ అస్సలు తగ్గేదేలే.!
- July 31, 2023
‘లైగర్’ దెబ్బతో డీలా పడిపోయిన పూరీ జగన్నాధ్, తాజాగా ‘డబుల్ ఇస్మార్ట్’ ప్రాజెక్ట్ని పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ముంబయ్లో ఓ షెడ్యూల్ పూర్తి చేసేశాడు సక్సెస్ ఫుల్గా.
ఇక రెండో షెడ్యూల్ కోసం విదేశీ టూర్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ షెడ్యూల్ని నభూతో న భవిష్యతి అనే రేంజ్లో తెరకెక్కించబోతున్నాడట. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేసేశాడట.
యాక్షన్ ప్రధానాంశంగా ఈ షెడ్యూల్ వుండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్స్ ఎవరన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. కానీ, బాలీవుడ్ నుంచి ముద్దుగుమ్మల్ని దించే యోచన చేస్తున్నాడనీ తెలుస్తోంది.
‘లైగర్’తో తగిలిన షాక్ నుంచి కోలుకోవడానికి పూరీకి కాస్త ఎక్కువే టైమ్ పట్టిందనుకోవచ్చు. ఏది ఏమైనా ఆ షాక్ నుంచి తేరుకుని, ‘డబుల్ ఇస్మార్ట్’ని డబుల్ రేంజ్లో రూపొందించబోతున్నాడు పూరీ. పూరీ కనెక్ట్స్లోనే ఈ సినిమా కూడా రూపొందబోతోంది.
తాజా వార్తలు
- శ్రీనగర్లో ఉద్రిక్తత..అలీ ఖమేనీ మరణవార్తతో రోడ్ల పైకి షియా ముస్లింలు
- ఐఆర్జీసీ కొత్త చీఫ్గా అహ్మద్ వాహిదీ
- ఖమేనీ తర్వాత ఎవరు? ఇరాన్ వారసత్వం పై ఉత్కంఠ
- పాకిస్తాన్ కు బిగ్ షాక్.. వరల్డ్ కప్ నుంచి ఔట్
- 63 ఇరానియన్ క్షిపణులు, 11 డ్రోన్లను అడ్డుకున్నాము: ఖతార్
- యూఏఈలో మార్చి 2 నుంచి 4వరకు రిమోట్ లెర్నింగ్..!!
- అక్రమ లైవ్ స్ట్రీమ్ల పై సీరియస్..ఇద్దరు అరెస్టు..!!
- విమాన సర్వీసులు నిలిపివేత..ప్రయాణికుల్లో నిరాశ..!!
- బయలుదేరిన గంటలోనే రిటర్న్..ప్రయాణికుల్లో ఆందోళన..!!
- కువైట్ లో ముగ్గురు భద్రతా సిబ్బందికి గాయాలు..!!









