డబుల్ ఇస్మార్ట్ విషయంలో పూరీ అస్సలు తగ్గేదేలే.!
- July 31, 2023
‘లైగర్’ దెబ్బతో డీలా పడిపోయిన పూరీ జగన్నాధ్, తాజాగా ‘డబుల్ ఇస్మార్ట్’ ప్రాజెక్ట్ని పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ముంబయ్లో ఓ షెడ్యూల్ పూర్తి చేసేశాడు సక్సెస్ ఫుల్గా.
ఇక రెండో షెడ్యూల్ కోసం విదేశీ టూర్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ షెడ్యూల్ని నభూతో న భవిష్యతి అనే రేంజ్లో తెరకెక్కించబోతున్నాడట. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేసేశాడట.
యాక్షన్ ప్రధానాంశంగా ఈ షెడ్యూల్ వుండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్స్ ఎవరన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. కానీ, బాలీవుడ్ నుంచి ముద్దుగుమ్మల్ని దించే యోచన చేస్తున్నాడనీ తెలుస్తోంది.
‘లైగర్’తో తగిలిన షాక్ నుంచి కోలుకోవడానికి పూరీకి కాస్త ఎక్కువే టైమ్ పట్టిందనుకోవచ్చు. ఏది ఏమైనా ఆ షాక్ నుంచి తేరుకుని, ‘డబుల్ ఇస్మార్ట్’ని డబుల్ రేంజ్లో రూపొందించబోతున్నాడు పూరీ. పూరీ కనెక్ట్స్లోనే ఈ సినిమా కూడా రూపొందబోతోంది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







