డబుల్ ఇస్మార్ట్ విషయంలో పూరీ అస్సలు తగ్గేదేలే.!
- July 31, 2023
‘లైగర్’ దెబ్బతో డీలా పడిపోయిన పూరీ జగన్నాధ్, తాజాగా ‘డబుల్ ఇస్మార్ట్’ ప్రాజెక్ట్ని పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ముంబయ్లో ఓ షెడ్యూల్ పూర్తి చేసేశాడు సక్సెస్ ఫుల్గా.
ఇక రెండో షెడ్యూల్ కోసం విదేశీ టూర్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ షెడ్యూల్ని నభూతో న భవిష్యతి అనే రేంజ్లో తెరకెక్కించబోతున్నాడట. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేసేశాడట.
యాక్షన్ ప్రధానాంశంగా ఈ షెడ్యూల్ వుండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్స్ ఎవరన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. కానీ, బాలీవుడ్ నుంచి ముద్దుగుమ్మల్ని దించే యోచన చేస్తున్నాడనీ తెలుస్తోంది.
‘లైగర్’తో తగిలిన షాక్ నుంచి కోలుకోవడానికి పూరీకి కాస్త ఎక్కువే టైమ్ పట్టిందనుకోవచ్చు. ఏది ఏమైనా ఆ షాక్ నుంచి తేరుకుని, ‘డబుల్ ఇస్మార్ట్’ని డబుల్ రేంజ్లో రూపొందించబోతున్నాడు పూరీ. పూరీ కనెక్ట్స్లోనే ఈ సినిమా కూడా రూపొందబోతోంది.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







