డబుల్ ఇస్మార్ట్ విషయంలో పూరీ అస్సలు తగ్గేదేలే.!
- July 31, 2023
‘లైగర్’ దెబ్బతో డీలా పడిపోయిన పూరీ జగన్నాధ్, తాజాగా ‘డబుల్ ఇస్మార్ట్’ ప్రాజెక్ట్ని పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ముంబయ్లో ఓ షెడ్యూల్ పూర్తి చేసేశాడు సక్సెస్ ఫుల్గా.
ఇక రెండో షెడ్యూల్ కోసం విదేశీ టూర్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ షెడ్యూల్ని నభూతో న భవిష్యతి అనే రేంజ్లో తెరకెక్కించబోతున్నాడట. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేసేశాడట.
యాక్షన్ ప్రధానాంశంగా ఈ షెడ్యూల్ వుండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్స్ ఎవరన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. కానీ, బాలీవుడ్ నుంచి ముద్దుగుమ్మల్ని దించే యోచన చేస్తున్నాడనీ తెలుస్తోంది.
‘లైగర్’తో తగిలిన షాక్ నుంచి కోలుకోవడానికి పూరీకి కాస్త ఎక్కువే టైమ్ పట్టిందనుకోవచ్చు. ఏది ఏమైనా ఆ షాక్ నుంచి తేరుకుని, ‘డబుల్ ఇస్మార్ట్’ని డబుల్ రేంజ్లో రూపొందించబోతున్నాడు పూరీ. పూరీ కనెక్ట్స్లోనే ఈ సినిమా కూడా రూపొందబోతోంది.
తాజా వార్తలు
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!









