ఆగస్టు 8న అవిశ్వాస తీర్మానం పై చర్చ
- August 01, 2023
న్యూఢిల్లీ: వచ్చే వారం పార్లమెంట్లో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం పై చర్చ జరనున్నది. మణిపూర్ అంశంపై ప్రధాని మోడీ ఉభయసభల్లో ప్రకటన చేయడం లేదని, అందుకే కేంద్ర సర్కార్పై అవిశ్వాసాన్ని ప్రవేశపెడుతున్నట్లు విపక్షాలు పేర్కొన్న విషయం తెలిసిందే. లోక్సభలో ఎంపీ గౌరవ్ గగోయ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని స్పీకర్ బిర్లా ఆమోదించారు. అయితే ఆ అంశంపై లోక్సభలో ఆగస్టు 8వ తేదీన చర్చ జరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారుల ద్వారా తెలుస్తోంది. ఆ చర్చకు ఆగస్టు 10వ తేదీన ప్రధాని మోడీ సమాధానం ఇస్తారన్నారు. జూలై 20వ తేదీన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి రోజు ఉభయసభలు మణిపూర్ అంశం విషయంలో వాయిదా పడుతూనే ఉన్నాయి. ఇవాళ తొమ్మిదో రోజు కూడా సభాకార్యక్రమాలు జరగలేదు.
అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ఎంపీ గౌరవ్ గగోయ్ నోటీసుపై 50 మంది సభ్యులు సంతకం చేశారు. లోక్సభలో 543 మంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం ఎన్డీఏ బలం 331. విపక్ష కూటమి ఇండియా బలం 144 మంది. అయితే ఈ తీర్మానాన్ని విపక్షం నెగ్గడం కుదరదు. కానీ మణిపూర్ అంశంపై ప్రధాని మోడీ మాట్లాడే విధంగా చేస్తుందని విపక్షాలు భావిస్తున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!
- పుణే మర్డర్ కేసు..సియా గోయల్ సోదరుడికి రూ.10 కోట్లు జరిమానా
- 'ది గేమ్చేంజర్స్ మిడిల్ ఈస్ట్'కు భారీ స్పందన..1,500 స్టార్టప్ దరఖాస్తులు
- ఎతిహాద్ రైల్కు విశేష స్పందన.. తొలి ప్రయాణానికి ముందే 10 వేలకు పైగా టికెట్ల విక్రయం
- హిమాచల్ ప్రదేశ్ వరదలు..చిక్కుకుపోయిన 50 పర్యాటక వాహనాలు
- గ్రీస్లో UPIని ప్రారంభించిన భారత్
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!







