బ్యాంక్ మిరాబాడ్ కు $3.02 మిలియన్ జరిమానా
- August 01, 2023
యూఏఈ: జూన్ 2018 – అక్టోబర్ 2021 మధ్య మనీ లాండరింగ్ నిరోధక (AML) వ్యవస్థలు, నియంత్రణలు సరిపోని కారణంగా బ్యాంక్ మిరాబాడ్ (మిడిల్ ఈస్ట్) లిమిటెడ్పై $3.02 మిలియన్ (Dh11.1 మిలియన్) జరిమానా విధించినట్లు దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ (DFSA) తెలిపింది. అయితే, మీరాబాడ్ జరిమానాను $3.9 మిలియన్ల (Dh14.322 మిలియన్లు) నుండి తగ్గించి, సమస్యను పరిష్కరించేందుకు అంగీకరించింది. మిరాబాడ్ యొక్క AML వ్యవస్థలు రిలేషన్షిప్ మేనేజర్ ద్వారా నిర్వహించబడే తొమ్మిది ఇంటర్కనెక్టడ్ క్లయింట్ అకౌంట్ల గ్రూప్ ల కోసం లావాదేవీలను ప్రాసెస్ చేసినట్లు గుర్తించినట్లు అథారిటీ తెలిపింది. ఇది మనీలాండరింగ్ అనుమానాలను పెంచిందని, దర్యాప్తులో ఇది నిజమని తేలడంతో జరిమానా విధించినట్లు DFSA చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇయాన్ జాన్స్టన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వేట్లపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటన
- వేట్లపాలెం ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్
- ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి
- ఇరాన్ పాఠశాల పై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి
- కాకినాడ జిల్లాలో భారీ పేలుడు.. 21 మంది మృతి
- ఖతార్ లో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు..!!
- ముహర్రక్ లో రోడ్ యాక్సెస్, సేఫ్టీ పై కౌన్సిల్ ఫోకస్..!!
- వాషింగ్టన్లో అమెరికా ఉపాధ్యక్షుడితో సయ్యద్ బదర్ భేటీ..!!
- కువైట్, ఖతర్, అబుధాబి, బహ్రెయిన్ పైనా ఇరాన్ మిస్సైళ్లు
- ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్ లలో క్యాష్ లావాదేవీల పై నిషేధం..!!









