విమాన టికెట్లు రూ. 511 నుంచే !
- May 17, 2016
రిటర్న్ టికెట్లపై 50 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ఎయిర్ ఏషియా ప్రకటించడంతో స్పైస్ జెట్ కూడా మళ్లీ ఆఫర్ల వ్యవహారంలోకి దిగింది. తన 11వ వార్షికోత్సవం సందర్భంగా మూడు రోజుల సేల్ ప్రకటించింది. స్వదేశీ విమాన టికెట్లను రూ. 511 నుంచి (బేస్ఫేర్ మాత్రమే), విదేశాలకు వెళ్లే విమానాల్లో టికెట్లను రూ. 2,111 నుంచి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ బుకింగ్స్ మంగళవారం నుంచి మొదలై గురువారం (మే 19) వరకు ఉంటాయి. ఆరోజు అర్ధరాత్రి వరకు కూడా ఈ ప్రత్యేక ఆఫర్ కింద టికెట్లు బుక్ చేసుకోవచ్చని స్పైస్జెట్ ప్రకటించింది.అలా బుక్ చేసుకున్న టికెట్లతో స్వదేశీ ప్రయాణాలను జూన్ 15 నుంచి సెప్టెంబర్ 30 లోగాను, విదేశీ ప్రయాణాలు అయితే జూన్ 1 నుంచి జూలై 20 వరకు చేయాల్సి ఉంటుంది. కేవలం స్పైస్జెట్ నెట్వర్క్లోని డైరెక్ట్ విమానాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని చెప్పారు. అయితే, ఈ ఆఫర్లో టికెట్లు పరిమితంగా ఉన్నాయని, అందువల్ల ముందు వచ్చినవాళ్లకు ముందు అనే పద్ధతిలోనే వీటిని కేటాయిస్తామని స్పైస్జెట్ తెలిపింది.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









