విమాన టికెట్లు రూ. 511 నుంచే !

- May 17, 2016 , by Maagulf
విమాన టికెట్లు రూ. 511 నుంచే !

రిటర్న్ టికెట్లపై 50 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ఎయిర్ ఏషియా ప్రకటించడంతో స్పైస్ జెట్ కూడా మళ్లీ ఆఫర్ల వ్యవహారంలోకి దిగింది. తన 11వ వార్షికోత్సవం సందర్భంగా మూడు రోజుల సేల్ ప్రకటించింది. స్వదేశీ విమాన టికెట్లను రూ. 511 నుంచి (బేస్‌ఫేర్ మాత్రమే), విదేశాలకు వెళ్లే విమానాల్లో టికెట్లను రూ. 2,111 నుంచి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ బుకింగ్స్ మంగళవారం నుంచి మొదలై గురువారం (మే 19) వరకు ఉంటాయి. ఆరోజు అర్ధరాత్రి వరకు కూడా ఈ ప్రత్యేక ఆఫర్ కింద టికెట్లు బుక్ చేసుకోవచ్చని స్పైస్‌జెట్ ప్రకటించింది.అలా బుక్ చేసుకున్న టికెట్లతో స్వదేశీ ప్రయాణాలను జూన్ 15 నుంచి సెప్టెంబర్ 30 లోగాను, విదేశీ ప్రయాణాలు అయితే జూన్ 1 నుంచి జూలై 20 వరకు చేయాల్సి ఉంటుంది. కేవలం స్పైస్‌జెట్ నెట్‌వర్క్‌లోని డైరెక్ట్ విమానాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని చెప్పారు. అయితే, ఈ ఆఫర్‌లో టికెట్లు పరిమితంగా ఉన్నాయని, అందువల్ల ముందు వచ్చినవాళ్లకు ముందు అనే పద్ధతిలోనే వీటిని కేటాయిస్తామని స్పైస్‌జెట్ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com