ఛార్మి తన బర్త్ డే వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య గ్రాండ్ గా జరుపుకుంది..
- May 17, 2016
టాలీవుడ్ బొద్దుగుమ్మ ఛార్మి ఈ సంవత్సరం తన బర్త్ డే వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య గ్రాండ్ గా జరుపుకుంది. 1987, మే 17న జన్మించిన ఛార్మి నేటితో 29వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. నటిగా, నిర్మాతగా మంచి సక్సెస్లు సాధించిన ఛార్మి మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, హిందీ చిత్రాలతో కలిపి దాదాపు 40 సినిమాలలో నటించింది. ఇక ఈ అమ్మడికి మాస్, అనుకోకుండా ఒక రోజు, పౌర్ణమి, రాఖీ సినిమాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇక ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన జ్యోతి లక్ష్మీ చిత్రం ఛార్మీకు విమర్శకుల నుండి ప్రశంసలు తెచ్చిపెట్టింది. మహేష్ బాబు, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో జనగణమన అనే చిత్రం త్వరలో రూపొందనుండగా, చిత్ర టైటిల్ ఛార్మి క్రియేషన్ బ్యానర్ పై రిజిస్టర్ అయినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాను ఛార్మీ నే నిర్మించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఛార్మి, తను ఎంచుకున్న రూట్లో మరిన్ని సక్సెస్లు సాధిస్తూ ముందుకెళ్ళాలని మనసారా కోరుకుందాం.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







