తెలుగులో వారం ఆలస్యంగా 'రాయుడు' సినిమా..
- May 17, 2016
విశాల్, శ్రీదివ్య హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం 'మరుదు'. ముత్తయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమా 'రాయుడు' పేరుతో తెలుగులో విడుదల కానుంది. సాధారణంగా తెలుగులోనూ మంచి మార్కెట్ ఏర్పరచుకున్న విశాల్ వంటి తమిళ హీరోలు తమ సినిమాలను రెండు భాషల్లోను ఒకేసారి విడుదలయ్యేల ప్లాన్ చేసుకుంటారు. అయితే 'మరుదు' తమిళంలో ఈ నెల 20న విడుదలవుతుండగా తెలుగులో 27న 'రాయుడు'గా తెరమీదికి రానున్నాడు విశాల్. దానికి కారణం అదే రోజున మహేశ్ నటించిన 'బ్రహ్మోత్సవం' ఇక్కడ విడుదలవుతుండటమే. మహేష్ లాంటి స్టార్ హీరో సినిమా థియేటర్లలో ఉత్సవం చేస్తున్నపుడు విశాల్ వెనక్కి తగ్గడం సరైన నిర్ణయమే. పైగా తర్వాత కూడా 'అఆ' వంటి సినిమాలు లైన్లో ఉన్నాయి. ఈ సంగతి ఇలా ఉంటే.. విశాల్ నటించిన 'మదగజరాజా' దాదాపు రెండేళ్ళుగా థియేటర్ మొహం చూడటానికి ఆపసోపాలు పడుతోంది. ఎట్టకేలకు అనువాద సినిమాలు ఆక్రమించిన ఈ నెల 13న రావడం ఖాయమనుకున్నా అదీ జరగలేదు. దానిపై విశాల్ మాటేమిటో మరి..!
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







