ప్రధాని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి భేటీ ముగిసింది.
- May 17, 2016
ప్రధాని నరేంద్రమోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి భేటీ ముగిసింది. రాష్ట్రంలో కరవు, ఇతర అంశాలపై ప్రధానికి సీఎం ప్రజంటేషన్ ఇచ్చారు. నీరు-చెట్టు, పోలవరం ప్రాజెక్టుపై కూడా చర్చించారు. ఈ సందర్భంగా 12 ముఖ్యమైన అంశాలతో ప్రధానికి నివేదిక అందజేశారు. సమావేశం అనంతరం ప్రధానితో చంద్రబాబు 20నిమిషాల పాటు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. చంద్రబాబు వెంట ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, సీఎస్ టక్కర్, ఉన్నతాధికారులు ఉన్నారు.
నివేదికలోని ముఖ్యాంశాలు * రాష్ట్రానికి ప్రత్యేక హోదా * 2014-15 రెవెన్యూ లోటు భర్తీ * అమరావతి నిర్మాణానికి ఆర్థిక సాయం * పోలవరం ప్రాజెక్టుకి నిధులు * సీమ, ఉత్తరాంధ్రల అభివృద్ధికి తోడ్పాటు * విభజన చట్టంలోనే షెడ్యూల్ 9, 10, 13లోని కార్పొరేషన్లు, సంస్థల విభజన * నియోజకవర్గాల పునర్విభజన * ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ * ఎఫ్ఆర్బీఎం పరిధి పెంపు * షెడ్యూల్ 13 విద్యాసంస్థలకు నిధులు * రాష్ట్రంలో కొత్త కేంద్రసంస్థల ఏర్పాటు
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







