ప్రధాని, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి భేటీ ముగిసింది.

- May 17, 2016 , by Maagulf
ప్రధాని,  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  భేటీ ముగిసింది.

ప్రధాని నరేంద్రమోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి భేటీ ముగిసింది. రాష్ట్రంలో కరవు, ఇతర అంశాలపై ప్రధానికి సీఎం ప్రజంటేషన్‌ ఇచ్చారు. నీరు-చెట్టు, పోలవరం ప్రాజెక్టుపై కూడా చర్చించారు. ఈ సందర్భంగా 12 ముఖ్యమైన అంశాలతో ప్రధానికి నివేదిక అందజేశారు. సమావేశం అనంతరం ప్రధానితో చంద్రబాబు 20నిమిషాల పాటు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. చంద్రబాబు వెంట ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, సీఎస్‌ టక్కర్‌, ఉన్నతాధికారులు ఉన్నారు.
నివేదికలోని ముఖ్యాంశాలు * రాష్ట్రానికి ప్రత్యేక హోదా * 2014-15 రెవెన్యూ లోటు భర్తీ * అమరావతి నిర్మాణానికి ఆర్థిక సాయం * పోలవరం ప్రాజెక్టుకి నిధులు * సీమ, ఉత్తరాంధ్రల అభివృద్ధికి తోడ్పాటు * విభజన చట్టంలోనే షెడ్యూల్‌ 9, 10, 13లోని కార్పొరేషన్లు, సంస్థల విభజన * నియోజకవర్గాల పునర్విభజన * ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ * ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి పెంపు * షెడ్యూల్‌ 13 విద్యాసంస్థలకు నిధులు * రాష్ట్రంలో కొత్త కేంద్రసంస్థల ఏర్పాటు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com