మళ్లీ తగ్గిన బంగారం ధర

- May 17, 2016 , by Maagulf
మళ్లీ తగ్గిన బంగారం ధర

పసిడి ధర మళ్లీ రూ.30వేల దిగువకు చేరింది. మంగళవారం రూ.230 తగ్గడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.29,820కి చేరింది. నగల వ్యాపారులు, రీటైలర్ల నుంచి కీలక సమయాల్లో కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో దీని ధర తగ్గిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్‌ బులియన్‌ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 0.04శాతం తగ్గి 1,273.50 యూఎస్‌ డాలర్లకు చేరింది.
పసిడి దారిలోనే వెండి సైతం పయనించింది. రూ.160 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.41,100కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు పెద్దగా జరగకపోవడంతో దీని ధర సైతం తగ్గిందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com