సెప్టెంబరు 1 నుంచి హోటల్ రూమ్లు, రెస్టారెంట్ల ఫీజులు తగ్గింపు
- August 12, 2023
అబుధాబి: డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం- అబుధాబి (DCT - అబుధాబి) శుక్రవారం ఎమిరేట్లోని హోటళ్లకు వర్తించే ప్రభుత్వ రుసుములను తగ్గించినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ఆతిథ్య, పర్యాటక రంగం నిరంతర వృద్ధికి మద్దతు ఇస్తుందని, అదే విధంగా పర్యాట రంగంలో అబుధాబిని ప్రపంచ అగ్రగామిగా నిలపుతుందని పేర్కొంది. ఈ మార్పులు సెప్టెంబరు 1, 2023 నుండి అమలులోకి వస్తుందని తెలిపింది. అతిథులకు ఇచ్చే పర్యాటక రుసుమును ఆరు శాతం నుండి నాలుగు శాతానికి తగ్గించారు. ఒక రాత్రికి ఒక గదికి Dh15 మునిసిపాలిటీ రుసుమును తీసివేశారు. ఆరు శాతం టూరిజం రుసుమును తీసివేయడం మరియు హోటల్ రెస్టారెంట్లకు వర్తించే నాలుగు శాతం మునిసిపాలిటీ రుసుము తగ్గింపు నిర్ణయంలో ఉన్నాయి. అలాగే కస్టమర్కు జారీ చేసిన ఇన్వాయిస్ విలువలో 4 శాతం మున్సిపాలిటీ రుసుము మాత్రం కొనసాగుతుందని తెలిపింది. 2023 చివరి నాటికి 24 మిలియన్లకు పైగా సందర్శకులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు DCT - అబుదాబిలో టూరిజం డైరెక్టర్ జనరల్ సలేహ్ మొహమ్మద్ అల్ గెజిరీ తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్కు కొత్త సుప్రీం లీడర్గా మొజ్తబా ఖామెనీ నియామకం
- ఖతార్ పై మిస్సైల్ అటాక్.. అడ్డుకున్న డిఫెన్స్ సిస్టమ్..!!
- బహ్రెయిన్ లో డ్రోన్ దాడి.. పలువురికి గాయాలు..!!
- ధరల పెంపు..449 సంస్థలకు Dh176,000 ఫైన్స్..!!
- డ్రోన్ను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- డ్రగ్స్ స్మగ్లింగ్ ను అడ్డుకున్న కోస్ట్ గార్డ్..!!
- ఇరాన్ ను హెచ్చరించిన సౌదీ అరేబియా..!!
- యూఏఈలోని భారతీయ స్కూళ్లకు ముందస్తు సెలవులు..!!
- ఘనంగా వంశీ–జమున అంతర్జాతీయ మహిళా పురస్కారాల ప్రదానం
- చరిత్ర సృష్టించిన భారత్.. టీ20 వరల్డ్ కప్ కైవసం









