గంధపు చెక్కల దొంగ వీరప్పన్ అట్టహాసంపై త్వరలో పుస్తకం!
- May 17, 2016
శంకర్ బిదిరి వెల్లడి బెంగళూరు : గంధపు చెక్కల దొంగ వీరప్పన్ అట్టహాసంపై త్వరలో పుస్తకాన్ని వెలువరించనున్నట్లు విశ్రాంత పోలీసు ప్రధానాధికారి శంకర్ బిదిరి వెల్లడించారు. మరో మూడు నెలల్లోగా పుస్తకం చదువరులకు అందుబాటులోకి వస్తుందన్నారు. ఆయన మంగళవారం బెంగళూరులో ఓ ప్రైవేట్ ఛానల్తో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. వీరప్పన్కు సంబంధించి ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి తెలిసిన సమాచారం కేవలం 20 శాతమేనని- తాను రచించనున్న పుస్తకంలో పూర్తి సమాచారం ఉంటుందన్నారు. వీరప్పన్ కోసం వేటలో పాల్గొన్న పోలీసు అధికారుల అనుభవాలు, వైఫల్యాల్ని కూడా అందులో పొందుపరుస్తానని చెప్పారు. ఆయన ఆటకట్టించేందుకు అప్పట్లో ఏర్పాటైన ప్రత్యేక పోలీసు దళానికి బిదిరి కొంతకాలం నేతృత్వం వహించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- డ్రోన్ ఆపరేట్..పోలీసుల అదుపులో ఐదుగురు..!!
- కువైట్ పై ఆరు డ్రోన్లతో దాడి..కూల్చేసిన సైన్యం..!!
- ప్రాంతీయ పరిణామాల పై జీసీసీ అత్యవసర సదస్సు..!!
- విజిటర్స్ కు గైడ్ లైన్స్ జారీ చేసిన ఖతార్..!!
- యూఏఈకి సంతాపం తెలిపిన ఒమన్..!!
- అబ్బాసియాలో విషాదం.. భారతీయ విద్యార్థి మృతి..!!
- బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజలు తరలింపు
- లోక్సభ స్పీకర్ పై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం..
- టీమ్ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా..
- సౌదీ రక్షణ దళాల చర్య: బాలిస్టిక్ క్షిపణి, రెండు డ్రోన్లు నిర్వీర్యం









