అబ్బాసియాలో విషాదం.. భారతీయ విద్యార్థి మృతి..!!

- March 10, 2026 , by Maagulf
అబ్బాసియాలో విషాదం.. భారతీయ విద్యార్థి మృతి..!!

కువైట్: అబ్బాసియాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో వాహనం ఢీకొనడంతో ఒక భారతీయ విద్యార్థి మరణించాడు.

మృతుడిని జలీబ్‌లోని యునైటెడ్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ప్లస్ టూ చదివే విద్యార్థి, తమిళనాడుకు చెందిన జోయెల్ మెవిన్ మైఖేల్‌గా గుర్తించారు.  ట్యూషన్ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా వాహనం ఢీకొని మరణించాడని పోలీసులు తెలిపారు.

ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, సమీపంలోని రోడ్డుపై ఉన్న వాహనం మరొక వాహనాన్ని ఢీకొట్టి, ఆ తరువాత విద్యార్థినిపైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. కొంతమంది యువకులు ఆ ప్రాంతంలో వాహనాలు నడుపుతున్నారని, దీనివల్ల ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ప్రమాద తీవ్రతకు  జోయెల్ అక్కడికక్కడే మరణించాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com