విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ రైలు రద్దు..ప్రయాణికుల ఆగ్రహం
- August 17, 2023
విశాఖపట్నం: గురువారం(ఈరోజు) ఉదయం విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన వందేభారత్ రైలును రద్దు చేసినట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. సాంకేతిక సమస్యల కారణంగా ఈ ఉదయం గం.5.45కు బయలుదేరాల్సిన రైలును రద్దు చేసినట్టు వివరించారు. అయితే, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉదయం 7 గంటలకు మరో రైలును ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వందేభారత్ రైలు ఆగే స్టేషన్లన్నింటిలో ఈ రైలు ఆగుతుందని చెప్పారు. ఉదయం 5 గంటల నుంచే రైలు రద్దు సమాచారాన్ని ప్రయాణికులకు అందజేశామని వివరించారు. కాగా, చివరి నిమిషంలో వందేభారత్ రైలు రద్దు కావడంతో అనేక మంది ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









