నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..

- August 18, 2023 , by Maagulf
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..

అమరావతి: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ గుడ్ న్యూస్ చెప్పారు. సెప్టెంబర్ లోపు మరో గ్రూప్-1 నోటిఫికేషన్ ఇస్తామన్నారు. అలాగే త్వరలోనే గ్రూప్-2 నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని చెప్పారు. కాగా, గ్రూప్-2 సిలబస్ లో భారీ మార్పులు చేపడుతున్నట్లు వెల్లడించారు.

ఇక, 17ఏళ్ల తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయబోతున్నట్లు వివరించారు. ఇవాళ గ్రూప్ 1 తుది ఫలితాలను గౌతమ్ సవాంగ్ విడుదల చేశారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొత్త నోటిఫికేషన్ల గురించి వివరాలు వెల్లడించారు.

గౌతమ్ సవాంగ్, ఏపీపీఎస్సీ ఛైర్మన్ మాట్లాడుతూ "త్వరలో 1,199 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తాం. ఇవి కాకుండా గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులకు నోటిఫికేషన్లు త్వరలో విడుదల చేస్తాం. సెప్టెంబర్ లోపు గ్రూప్-1 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం. త్వరలోనే గ్రూప్-2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ నూ విడుదల చేస్తాం. గ్రూప్-1 లో 100 పోస్టులు, గ్రూప్-2 లో వెయ్యి పోస్టులకుపైగా ఖాళీలు భర్తీ చేస్తాం. గ్రూప్స్ సిలబస్ లో మార్పులు చేస్తున్నాం. యూపీఎస్సీ విధానంలో ఏపీపీఎస్సీ నియామక ప్రక్రియ చేపడతాం. నిరుద్యోగులు గ్రూప్స్ ఉద్యోగాలకు సిద్ధం కావచ్చు. ఉద్యోగ నియామకాలపై వదంతులు, తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు”.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com