భారత్ 40% సుంకం ప్రకటించడంతో ఉల్లి ధరలు పెరుగుతాయా?
- August 22, 2023
యూఏఈ: ప్రపంచంలోనే అతిపెద్ద ఉల్లిపాయలను ఎగుమతి చేసే భారతదేశం ఇటీవల కూరగాయలపై 40 శాతం సుంకాన్ని ప్రకటించింది. భారతీయ ఉల్లిపాయలకు అతిపెద్ద మార్కెట్లలో యూఏఈ ఉన్నప్పటికీ.. దేశంలోని రిటైలర్లు వాటి లభ్యత లేదా ధరలపై ప్రభావం చూపదని అంటున్నారు.పరిశ్రమ ఎగ్జిక్యూటివ్ల ప్రకారం.. టర్కీ, ఈజిప్ట్, గ్రీస్, యుఎస్, ఇటలీ వంటి ఇతర ప్రధాన మార్కెట్ల నుండి కూడా కూరగాయలు లభిస్తున్నందున యూఏఈలో ఉల్లిపాయలకు కొరత లేదన్నారు. సరఫరా-డిమాండ్ అసమతుల్యత కారణంగా ధరలు పెరిగే అవకాశం ఉన్నందున భారత్ సుంకాన్ని విధించాలని నిర్ణయించింది. ఉల్లిపాయలపై భారత ఎగుమతి సుంకం కారణంగా రిటైల్ మార్కెట్ పెద్దగా ప్రతికూల ప్రభావం ఉంటుందని అనుకోవడం లేదని లులు గ్రూప్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ వి.నందకుమార్ తెలిపారు. “గత సంవత్సరం ఇదు సమయంలో భారతదేశం ఉల్లిపాయల ఎగుమతులను నిషేధించింది. ఈ సంవత్సరం అది జరుగుతుందని మేము ఊహించాము. మేము సిద్ధంగా ఉన్నాము. టర్కీ, ఈజిప్ట్, గ్రీస్, కొన్ని ఇతర పొరుగు దేశాల నుండి ప్రత్యామ్నాయంగా ఉల్లిపాయలను దిగుమతి చేసుకుంటున్నాం. ” అని నందకుమార్ తెలిపారు. మరోవైపు భారత్ లో సప్లై-డిమాండ్ అసమతుల్యత కారణంగా ఆగస్టు చివరి నాటికి ఉల్లి ధరలలో పెరుగుదల నమోదయ్యే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా. రిటైల్ మార్కెట్లో సెప్టెంబర్ ప్రారంభం నుండి ధరలు గణనీయంగా పెరుగుతాయని, కిలోకు రూ.60-70 వరకు చేరుతుందని క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ తెలిపింది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







