భారత్ 40% సుంకం ప్రకటించడంతో ఉల్లి ధరలు పెరుగుతాయా?
- August 22, 2023
యూఏఈ: ప్రపంచంలోనే అతిపెద్ద ఉల్లిపాయలను ఎగుమతి చేసే భారతదేశం ఇటీవల కూరగాయలపై 40 శాతం సుంకాన్ని ప్రకటించింది. భారతీయ ఉల్లిపాయలకు అతిపెద్ద మార్కెట్లలో యూఏఈ ఉన్నప్పటికీ.. దేశంలోని రిటైలర్లు వాటి లభ్యత లేదా ధరలపై ప్రభావం చూపదని అంటున్నారు.పరిశ్రమ ఎగ్జిక్యూటివ్ల ప్రకారం.. టర్కీ, ఈజిప్ట్, గ్రీస్, యుఎస్, ఇటలీ వంటి ఇతర ప్రధాన మార్కెట్ల నుండి కూడా కూరగాయలు లభిస్తున్నందున యూఏఈలో ఉల్లిపాయలకు కొరత లేదన్నారు. సరఫరా-డిమాండ్ అసమతుల్యత కారణంగా ధరలు పెరిగే అవకాశం ఉన్నందున భారత్ సుంకాన్ని విధించాలని నిర్ణయించింది. ఉల్లిపాయలపై భారత ఎగుమతి సుంకం కారణంగా రిటైల్ మార్కెట్ పెద్దగా ప్రతికూల ప్రభావం ఉంటుందని అనుకోవడం లేదని లులు గ్రూప్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ వి.నందకుమార్ తెలిపారు. “గత సంవత్సరం ఇదు సమయంలో భారతదేశం ఉల్లిపాయల ఎగుమతులను నిషేధించింది. ఈ సంవత్సరం అది జరుగుతుందని మేము ఊహించాము. మేము సిద్ధంగా ఉన్నాము. టర్కీ, ఈజిప్ట్, గ్రీస్, కొన్ని ఇతర పొరుగు దేశాల నుండి ప్రత్యామ్నాయంగా ఉల్లిపాయలను దిగుమతి చేసుకుంటున్నాం. ” అని నందకుమార్ తెలిపారు. మరోవైపు భారత్ లో సప్లై-డిమాండ్ అసమతుల్యత కారణంగా ఆగస్టు చివరి నాటికి ఉల్లి ధరలలో పెరుగుదల నమోదయ్యే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా. రిటైల్ మార్కెట్లో సెప్టెంబర్ ప్రారంభం నుండి ధరలు గణనీయంగా పెరుగుతాయని, కిలోకు రూ.60-70 వరకు చేరుతుందని క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ తెలిపింది.
తాజా వార్తలు
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!







