భారీ వర్షాల కారణంగా శ్రీలంకలో వరదలు..
- May 18, 2016
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీలంకలో వరదలు సంభవించాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరదల కారణంగా ఇప్పటివరకు 35 మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. మరో 150 మంది గల్లంతయ్యారు. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. కెగల్లా ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో 66 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 22 జిల్లాల్లో 20సెం.మీ. పైగా వర్షపాతం నమోదైంది. దీంతో 300మంది సైనిక సిబ్బందితో అధికారులు సహాయచర్యలు చేపట్టారు. అరనాయకీ గ్రామంలో చిక్కుకున్న 150మందిని సహాయ సిబ్బంది రక్షించారు. ఇప్పటివరకు వరదల్లో చిక్కుకున్న వందలాది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు తెలిపారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







