భారీ వర్షాల కారణంగా శ్రీలంకలో వరదలు..

- May 18, 2016 , by Maagulf
భారీ వర్షాల కారణంగా శ్రీలంకలో వరదలు..

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీలంకలో వరదలు సంభవించాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరదల కారణంగా ఇప్పటివరకు 35 మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. మరో 150 మంది గల్లంతయ్యారు. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. కెగల్లా ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో 66 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 22 జిల్లాల్లో 20సెం.మీ. పైగా వర్షపాతం నమోదైంది. దీంతో 300మంది సైనిక సిబ్బందితో అధికారులు సహాయచర్యలు చేపట్టారు. అరనాయకీ గ్రామంలో చిక్కుకున్న 150మందిని సహాయ సిబ్బంది రక్షించారు. ఇప్పటివరకు వరదల్లో చిక్కుకున్న వందలాది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు తెలిపారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com