భారీ వర్షాల కారణంగా శ్రీలంకలో వరదలు..
- May 18, 2016
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీలంకలో వరదలు సంభవించాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరదల కారణంగా ఇప్పటివరకు 35 మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. మరో 150 మంది గల్లంతయ్యారు. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. కెగల్లా ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో 66 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 22 జిల్లాల్లో 20సెం.మీ. పైగా వర్షపాతం నమోదైంది. దీంతో 300మంది సైనిక సిబ్బందితో అధికారులు సహాయచర్యలు చేపట్టారు. అరనాయకీ గ్రామంలో చిక్కుకున్న 150మందిని సహాయ సిబ్బంది రక్షించారు. ఇప్పటివరకు వరదల్లో చిక్కుకున్న వందలాది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు తెలిపారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









