చంద్రయాన్ మిషన్ డైరెక్టర్ మన తెలుగువాడు
- August 24, 2023
బెంగుళూరు: చంద్రయాన్-3 విజయవంతంగా చందమామను చేరగానే తొలుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఆ వెంటనే ఇస్రో చైర్మన్ మాట్లాడి, ఈ మిషన్ వెనుకున్న కీలక వ్యక్తుల్ని ప్రపంచానికి పరిచయం చేసారు. వారిలో ఏకైక తెలుగు శాస్త్రజ్ఞుడు మోటమర్రి శ్రీకాంత్.
శ్రీకాంత్ స్వస్థలం విశాఖపట్నం. మచిలీపట్నం నిర్మల హై స్కూల్ నుంచి పదవ తరగతి(1994 బ్యాచ్) పాసయ్యారు.అయితే ఈయనకు సైన్సులో బీజాలు మచిలీపట్నం హిందూ కళాశాలలో పడ్డాయి. అక్కడ మొదటి సంవత్సరం బీ.ఎస్సీ చదవగా, తర్వాతి రెండేళ్లు విశాఖ ఏ.వి.ఎన్ కాలేజీలో చదివారు. పిదప ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ పట్టాపొందారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్ ఇండోర్ నుంచి ఎంటెక్ పూర్తి చేసారు. అనంతరం తన ప్రతిభను చూపి ఎంతో పోటీకి తట్టుకుని బెంగళూరులో ఇస్రో సైంటిష్టుగా చేరారు.
వృత్తే ధ్యేయంగా జీవిస్తూ అంచెలంచెలుగా వివిధ హోదాల్లో పని చేస్తూ వస్తున్నారు. మార్స్ మిషన్ కి ఆపరేషన్ డైరెక్టర్, చంద్రయాన్-2 కి డిప్యూటీ మిషన్ డైరెక్టర్ ఈయనే. ఇప్పుడు ప్రపంచం గర్వంగా చెప్పుకుంటున్న చంద్రయాన్-3 కి మిషన్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించిన శాస్త్రవేత్త మోటమర్రి శ్రీకాంత్. ప్రస్తుతం ఈయన బెంగళూరులో జీవిస్తున్నారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోను, ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగువాళ్లు ఇది గర్వపడాల్సిన విషయం.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







