'భారతదేశం చరిత్ర సృష్టిస్తూనే ఉంది': షేక్ మొహమ్మద్

- August 24, 2023 , by Maagulf
\'భారతదేశం చరిత్ర సృష్టిస్తూనే ఉంది\': షేక్ మొహమ్మద్

యూఏఈ: భారత్ చేపట్టిన చంద్రయాన్-3 విజయవంతం కావడంపై యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అభినందనలు తెలిపారు. " భారతదేశం చరిత్ర సృష్టిస్తూనే ఉంది" అని యూఏఈ వైస్ ప్రెసిడెంట్ ట్వీట్ చేశారు. చంద్రయాన్-3 మిషన్‌తో చంద్రునిపై విజయవంతంగా దిగిన నాలుగో దేశంగా(అమెరా, రష్యా, చైనా) భారత్ అవతరించింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. పబ్లిక్ ఎడ్యుకేషన్ అండ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ రాష్ట్ర మంత్రి సారా అల్ అమిరి, మహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్ (MBRSC) డైరెక్టర్ జనరల్ సేలం అల్ మర్రి లు కూడా భారత్ కు అభినందనలు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com