'భారతదేశం చరిత్ర సృష్టిస్తూనే ఉంది': షేక్ మొహమ్మద్
- August 24, 2023
యూఏఈ: భారత్ చేపట్టిన చంద్రయాన్-3 విజయవంతం కావడంపై యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అభినందనలు తెలిపారు. " భారతదేశం చరిత్ర సృష్టిస్తూనే ఉంది" అని యూఏఈ వైస్ ప్రెసిడెంట్ ట్వీట్ చేశారు. చంద్రయాన్-3 మిషన్తో చంద్రునిపై విజయవంతంగా దిగిన నాలుగో దేశంగా(అమెరా, రష్యా, చైనా) భారత్ అవతరించింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. పబ్లిక్ ఎడ్యుకేషన్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ రాష్ట్ర మంత్రి సారా అల్ అమిరి, మహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్ (MBRSC) డైరెక్టర్ జనరల్ సేలం అల్ మర్రి లు కూడా భారత్ కు అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







