'భారతదేశం చరిత్ర సృష్టిస్తూనే ఉంది': షేక్ మొహమ్మద్
- August 24, 2023
యూఏఈ: భారత్ చేపట్టిన చంద్రయాన్-3 విజయవంతం కావడంపై యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అభినందనలు తెలిపారు. " భారతదేశం చరిత్ర సృష్టిస్తూనే ఉంది" అని యూఏఈ వైస్ ప్రెసిడెంట్ ట్వీట్ చేశారు. చంద్రయాన్-3 మిషన్తో చంద్రునిపై విజయవంతంగా దిగిన నాలుగో దేశంగా(అమెరా, రష్యా, చైనా) భారత్ అవతరించింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. పబ్లిక్ ఎడ్యుకేషన్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ రాష్ట్ర మంత్రి సారా అల్ అమిరి, మహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్ (MBRSC) డైరెక్టర్ జనరల్ సేలం అల్ మర్రి లు కూడా భారత్ కు అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధుల వెల్లువ
- శాంతి చర్చల పై పాక్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- శాంతి చర్చల విజయం అమెరికా చేతుల్లోనే ఉందన్న ఇరాన్ అధ్యక్షుడు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..









