విజయవంతమైన ఫృథ్వి-2 ప్రయోగం
- May 18, 2016
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఫృథ్వి-2 క్షిపణిని ఒడిశాలోని చాందీపూర్ నుంచి మరోసారి విజయవంతంగా ప్రయోగించారు. భారత అమ్ముల పొదిలో చేరనున్న అత్యాధునికమైన ఈ క్షిపణిని సాధారణ పరీక్షల్లో భాగంగా ఈరోజు పరీక్షించారు. అణ్వస్త్ర సామర్థ్యం గల ఫృథ్వి -2 క్షిపణి 350 కి.మీ.ల దూరంలో లక్ష్యాలను ఛేదించగలదు. 500 నుంచి వెయ్యి కేజీల వార్హెడ్ను మోసుకుపోగలదు. రెండు సార్లు ప్రయోగానికి ఏర్పాట్లు చేసినా మొదటి ట్రయల్ విజయవంతంగా పూర్తయిన తర్వాత సాంకేతిక కారణాల వల్ల రెండో ప్రయోగం నిలిపేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రయోగాన్ని డీఆర్డీఓ, రక్షణ శాఖ అధికారులు పర్యవేక్షించారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







