బహ్రెయిన్లోని భారతీయులు 'EoIBh కనెక్ట్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి
- August 27, 2023
బహ్రెయిన్: భారత రాయబార కార్యాలయం రాయబారి వినోద్ కురియన్ జాకబ్ అధ్యక్షతన పబ్లిక్ మీట్ ను నిర్వహించింది. ఎంబసీ కాన్సులర్ బృందం, న్యాయవాదుల ప్యానెల్ కూడా హాజరయ్యారు. హిందీ, ఇంగ్లీష్, తమిళం మరియు మలయాళంలో నిర్వహించిన బహిరంగ సభలో 75 మందికి పైగా భారతీయులు పాల్గొన్నారు. ఆగస్టు 15న భారత స్వాతంత్య్ర 77వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రాయబార కార్యాలయం నిర్వహించిన ఫ్లాగ్ హోస్టింగ్ కార్యక్రమంలో భారతీయ కమ్యూనిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొనడం పట్ల రాయబారి వినోద్ సంతోషం వ్యక్తం చేశారు. ఇండియన్ ఎంబసీ, IVS గ్లోబల్లో కూడా కాన్సులర్ మరియు వీసా సేవలను పొందేందుకు ఆన్లైన్ అపాయింట్మెంట్లను పొందేందుకు కొత్త మొబైల్ అప్లికేషన్ 'EoIBh కనెక్ట్'ని డౌన్లోడ్ చేసుకోవాలని కమ్యూనిటీ సభ్యులను ఆయన కోరారు. భారతీయ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ ద్వారా అవసరమైన వారికి బోర్డింగ్, వసతిని అందించడంతోపాటు అత్యవసర ధృవీకరణ పత్రాలు, టిక్కెట్లను మంజూరు చేయడం ద్వారా ఇంటి పనిమనిషితో సహా కష్టాల్లో ఉన్న భారతీయ పౌరులకు ఎంబసీ సహాయం చేయడం కొనసాగిస్తుందని వినోద్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







