సెప్టెంబరు 1 నుంచి డిజిటల్గా ట్రాఫిక్ టిక్కెట్లు
- August 29, 2023
కువైట్: సెప్టెంబర్ 1 నుండి అన్ని ట్రాఫిక్ ఉల్లంఘనలు డిజిటల్ ప్లాట్ఫారమ్లో నమోదు చేయబడతాయని అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత మంత్రి షేక్ తలాల్ అల్-ఖలీద్ ఆదేశాలతో డిజిటల్ పరివర్తనలో భాగంగా అంతర్గత మంత్రిత్వ శాఖ పోలీసు అధికారుల కోసం 'రాసెడ్' యాప్ను ప్రారంభించింది. దీనిద్వారా అధికారులు ట్రాఫిక్ టిక్కెట్లను డిజిటల్గా జారీ చేయనున్నారు. "Rased" యాప్ నివాసితుల కోసం 'Sahel' యాప్తో అనుసంధానించబడింది. 'రాసెడ్' యాప్లో పోలీసు అధికారి డిజిటల్గా అప్లోడ్ చేసినప్పుడు డ్రైవర్ ట్రాఫిక్ టిక్కెట్లను వెంటేనే అందుకుంటాడు. ట్రాఫిక్ జరిమానాలను వేగంగా జారీ చేయడానికి, జరిమానాలను వసూలు చేయడానికి తద్వారా ట్రాఫిక్ను నియంత్రించే మంత్రిత్వ శాఖ ప్రయత్నంలో ఈ కొత్త చర్య భాగమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. పౌరులు, నివాసితులు ట్రాఫిక్ నియమాలు, పోలీసుల సూచనలకు కట్టుబడి ఉండాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!







