సెప్టెంబరు 1 నుంచి డిజిటల్గా ట్రాఫిక్ టిక్కెట్లు
- August 29, 2023
కువైట్: సెప్టెంబర్ 1 నుండి అన్ని ట్రాఫిక్ ఉల్లంఘనలు డిజిటల్ ప్లాట్ఫారమ్లో నమోదు చేయబడతాయని అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత మంత్రి షేక్ తలాల్ అల్-ఖలీద్ ఆదేశాలతో డిజిటల్ పరివర్తనలో భాగంగా అంతర్గత మంత్రిత్వ శాఖ పోలీసు అధికారుల కోసం 'రాసెడ్' యాప్ను ప్రారంభించింది. దీనిద్వారా అధికారులు ట్రాఫిక్ టిక్కెట్లను డిజిటల్గా జారీ చేయనున్నారు. "Rased" యాప్ నివాసితుల కోసం 'Sahel' యాప్తో అనుసంధానించబడింది. 'రాసెడ్' యాప్లో పోలీసు అధికారి డిజిటల్గా అప్లోడ్ చేసినప్పుడు డ్రైవర్ ట్రాఫిక్ టిక్కెట్లను వెంటేనే అందుకుంటాడు. ట్రాఫిక్ జరిమానాలను వేగంగా జారీ చేయడానికి, జరిమానాలను వసూలు చేయడానికి తద్వారా ట్రాఫిక్ను నియంత్రించే మంత్రిత్వ శాఖ ప్రయత్నంలో ఈ కొత్త చర్య భాగమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. పౌరులు, నివాసితులు ట్రాఫిక్ నియమాలు, పోలీసుల సూచనలకు కట్టుబడి ఉండాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!
- 1,000 కి పైగా ఇరానియన్ దాడులు: యూఏఈ
- అమెరికా కాన్సులేట్ పై డ్రోన్ అటాక్ పై దుబాయ్ క్లారిటీ..!!
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్









