నిప్పులు చిమ్ముతూ నింగికి దూసుకెళ్లిన ఆదిత్య ఎల్‌-1

- September 02, 2023 , by Maagulf
నిప్పులు చిమ్ముతూ నింగికి దూసుకెళ్లిన ఆదిత్య ఎల్‌-1

శ్రీహరికోట: ఆదిత్య ఎల్‌-1తో పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగికి దూసుకెళ్లింది. సూర్యుడి రహస్యాలను ఛేదించే ఉద్దేశంతో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన ఆదిత్య ఎల్‌-1 మిషన్ ప్రయోగానికి శాస్త్రవేత్తలు శుక్రవారం కౌంట్ డౌన్ ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఇవాళ సరిగ్గా 11.50 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరి కోట సతీశ్ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (SHAR) నుంచి ఆదిత్య ఎల్‌-1ను ప్రయోగించారు. ఆదిత్య ఎల్-1ను లెగ్రాంజ్ పాయింట్ 1 కక్ష్యలోకి ప్రవేశపెడతారు. అందుకు దాదాపు 125 రోజులు పడుతుంది. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో లెగ్రాంజ్ పాయింట్ ఉంటుంది.

సౌర మండలంలోని గాలులు, కరోనాతో పాటు సూర్యుడి నుంచి వచ్చే కాంతి కిరణాల ప్రభావంపై ఇస్రో పరిశోధనలు చేస్తుంది. అలాగే,సౌర తుపాన్ల సమయంలో వెలువడే రేణువులతో పాటు ఫొటోస్పియర్‌ (కాంతి మండలం), క్రోమోస్పియర్‌ (వర్ణ మండలం)పై పరిశోధనలు చేస్తారు. ఆదిత్య-ఎల్‌ 1 ఉపగ్రహం 1,475 కిలోల బరువు ఉంటుంది. ఇందులో మొత్తం ఏడు పేలోడ్లు ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com