నిప్పులు చిమ్ముతూ నింగికి దూసుకెళ్లిన ఆదిత్య ఎల్-1
- September 02, 2023
శ్రీహరికోట: ఆదిత్య ఎల్-1తో పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగికి దూసుకెళ్లింది. సూర్యుడి రహస్యాలను ఛేదించే ఉద్దేశంతో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన ఆదిత్య ఎల్-1 మిషన్ ప్రయోగానికి శాస్త్రవేత్తలు శుక్రవారం కౌంట్ డౌన్ ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఇవాళ సరిగ్గా 11.50 గంటలకు ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరి కోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (SHAR) నుంచి ఆదిత్య ఎల్-1ను ప్రయోగించారు. ఆదిత్య ఎల్-1ను లెగ్రాంజ్ పాయింట్ 1 కక్ష్యలోకి ప్రవేశపెడతారు. అందుకు దాదాపు 125 రోజులు పడుతుంది. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో లెగ్రాంజ్ పాయింట్ ఉంటుంది.
సౌర మండలంలోని గాలులు, కరోనాతో పాటు సూర్యుడి నుంచి వచ్చే కాంతి కిరణాల ప్రభావంపై ఇస్రో పరిశోధనలు చేస్తుంది. అలాగే,సౌర తుపాన్ల సమయంలో వెలువడే రేణువులతో పాటు ఫొటోస్పియర్ (కాంతి మండలం), క్రోమోస్పియర్ (వర్ణ మండలం)పై పరిశోధనలు చేస్తారు. ఆదిత్య-ఎల్ 1 ఉపగ్రహం 1,475 కిలోల బరువు ఉంటుంది. ఇందులో మొత్తం ఏడు పేలోడ్లు ఉన్నాయి.
తాజా వార్తలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత







