ముంబై ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 3 ఒమానీ సినిమాలు

- September 03, 2023 , by Maagulf
ముంబై ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 3 ఒమానీ సినిమాలు

ముంబై: భారతదేశంలోని ముంబైలో సెప్టెంబర్ 10 వరకు కొనసాగనున్న ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 11వ ఎడిషన్‌లో మూడు ఒమానీ చిత్రాలు ప్రదర్శితమయ్యాయి. దర్శకుడు అబ్దుల్లా అల్ అజ్మీ 'అల్ మన్యుర్' చిత్రం, దర్శకుడు దలీలా అల్ దరేయ్ కోసం 'అల్ మకసరా' , 'హషఫ్' చిత్రాలను ప్రదర్శించడం ద్వారా ఒమన్ ఫిల్మ్ సొసైటీ ద్వారా సుల్తానేట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భాగం అయ్యాయి. అల్ మాన్యూర్ చిత్రం ఒమానీ అల్ జమాత్ ఆర్ట్‌ను ప్రదర్శిస్తుంది. అల్ మకసరా చిత్రం ఒమానీ వారసత్వం గుర్తింపులో భాగమైన ఒమానీ ఖంజర్ (బాకు) పై నిర్మించారు. హషాఫ్ చిత్రం సుదూర ఒమానీ గ్రామంలో నివసించే ఒక మహిళ , గ్రామస్థులు వారి జీవన విధానానికి ఎలా కట్టుబడి ఉంటారు అనే కథను తెలియజేస్తుంది. డైరెక్టర్ మహ్మద్ అల్ అజ్మీ మాట్లాడుతూ.. అంతర్జాతీయ ఉత్సవాల్లో పాల్గొనడం వల్ల విభిన్న సంస్కృతుల గురించి తెలుసుకోవడంతోపాటు ఇతర అనుభవాలను తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com