అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- February 25, 2026
యూఏఈ: అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఫిబ్రవరిలో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో యూఏఈలో పెట్రోల్ ధరలు మార్చి 2026లో పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అమెరికా-ఇరాన్ సైనిక వివాదం భయాల కారణంగా ఫిబ్రవరిలో ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు పెరిగాయి. బ్రెంట్ బ్యారెల్కు $71 మార్కును దాటింది. ఉద్రిక్తతలు మరింత పెరిగితే, చమురు ధరలు బ్యారెల్కు $100 కంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
కాగా, ఫిబ్రవరి నెలలో యూఏఈ పెట్రోల్ ధరలను లీటరుకు ఎనిమిది నుంచి తొమ్మిది ఫిల్స్ తగ్గించింది. సూపర్ 98, స్పెషల్ 95 మరియు ఇ-ప్లస్ 91 ధరలు వరుసగా లీటరుకు Dh2.45, Dh2.33 మరియు Dh2.26గా ఉన్నాయి.
టెహ్రాన్ కొన్ని గంటల పాటు హార్ముజ్ జలసంధిని మూసివేసిన తర్వాత ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఇటీవల పెరిగాయని, ఇది చమురు సరఫరాపై ప్రభావం చూపిందని Capital.com సీనియర్ మార్కెట్ విశ్లేషకురాలు డేనియేలా హాథోర్న్ అన్నారు. హార్ముజ్ జలసంధి ద్వారానే ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం రవాణా అవుతుందని, ఇక్కడ ఏదైనా అంతరాయం ఏర్పడితే అది చమురు ధరలపైన ఉంటుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!







