అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- February 25, 2026
యూఏఈ: అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఫిబ్రవరిలో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో యూఏఈలో పెట్రోల్ ధరలు మార్చి 2026లో పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అమెరికా-ఇరాన్ సైనిక వివాదం భయాల కారణంగా ఫిబ్రవరిలో ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు పెరిగాయి. బ్రెంట్ బ్యారెల్కు $71 మార్కును దాటింది. ఉద్రిక్తతలు మరింత పెరిగితే, చమురు ధరలు బ్యారెల్కు $100 కంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
కాగా, ఫిబ్రవరి నెలలో యూఏఈ పెట్రోల్ ధరలను లీటరుకు ఎనిమిది నుంచి తొమ్మిది ఫిల్స్ తగ్గించింది. సూపర్ 98, స్పెషల్ 95 మరియు ఇ-ప్లస్ 91 ధరలు వరుసగా లీటరుకు Dh2.45, Dh2.33 మరియు Dh2.26గా ఉన్నాయి.
టెహ్రాన్ కొన్ని గంటల పాటు హార్ముజ్ జలసంధిని మూసివేసిన తర్వాత ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఇటీవల పెరిగాయని, ఇది చమురు సరఫరాపై ప్రభావం చూపిందని Capital.com సీనియర్ మార్కెట్ విశ్లేషకురాలు డేనియేలా హాథోర్న్ అన్నారు. హార్ముజ్ జలసంధి ద్వారానే ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం రవాణా అవుతుందని, ఇక్కడ ఏదైనా అంతరాయం ఏర్పడితే అది చమురు ధరలపైన ఉంటుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక









