సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- February 25, 2026
కువైట్: కువైట్లో పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహారించనున్నారు. సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై పర్యావరణ ప్రజా అథారిటీ (EPA) ఆంక్షలు విధించింది. బీచ్లో పక్షులను ఫోటో తీయడానికి డ్రోన్లను ఉపయోగించడంపై హెచ్చరిక జారీ చేసింది.
ఇటీవల సోషల్ మీడియాలో ఈ తరహా వీడియోలు వైరల్ కావడంపై అథారిటీ స్పందించింది. వన్యప్రాణులను ఇబ్బంది పెట్టడం వల్ల వాటి సంతానోత్పత్తి సైకిల్స్ మరియు సహజ ప్రవర్తనకు ఇబ్బంది కలుగుతుందని అథారిటీ తెలిపింది.
పర్యావరణ పరిరక్షణ చట్టంలోని ఆర్టికల్ (100)ను ఉటంకిస్తూ.. వన్యప్రాణులు, వాటి గూళ్ళు, గుడ్లు లేదా ఆవాసాలకు హాని కలిగించడం నిషేధించబడిందని అథారిటీ గుర్తు చేసింది. చట్టాలు, నిబంధనలను పాటించాలని సూచనలు ఇస్తూనే.. ఏదైనా ఉల్లంఘనలను నివేదించాలని ప్రజలకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- 'చెక్ యువర్ హెల్త్' క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్కు ట్రంప్ షాక్..
- లండన్లో అగ్నిప్రమాదం..తెలుగు యువకుడు మృతి
- ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేటితో ముగింపు!









