సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- February 25, 2026
కువైట్: కువైట్లో పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహారించనున్నారు. సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై పర్యావరణ ప్రజా అథారిటీ (EPA) ఆంక్షలు విధించింది. బీచ్లో పక్షులను ఫోటో తీయడానికి డ్రోన్లను ఉపయోగించడంపై హెచ్చరిక జారీ చేసింది.
ఇటీవల సోషల్ మీడియాలో ఈ తరహా వీడియోలు వైరల్ కావడంపై అథారిటీ స్పందించింది. వన్యప్రాణులను ఇబ్బంది పెట్టడం వల్ల వాటి సంతానోత్పత్తి సైకిల్స్ మరియు సహజ ప్రవర్తనకు ఇబ్బంది కలుగుతుందని అథారిటీ తెలిపింది.
పర్యావరణ పరిరక్షణ చట్టంలోని ఆర్టికల్ (100)ను ఉటంకిస్తూ.. వన్యప్రాణులు, వాటి గూళ్ళు, గుడ్లు లేదా ఆవాసాలకు హాని కలిగించడం నిషేధించబడిందని అథారిటీ గుర్తు చేసింది. చట్టాలు, నిబంధనలను పాటించాలని సూచనలు ఇస్తూనే.. ఏదైనా ఉల్లంఘనలను నివేదించాలని ప్రజలకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









