ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు..
- May 19, 2016
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు కొన్నిచోట్ల ఊహించినట్లుగానే రాగా.. తమిళనాడులో మాత్రం ఎవరూ ఊహించని విధంగా అన్నాడీఎంకే రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు సిద్ధమైంది. పశ్చిమబెంగాల్లో ఇంతకుముందు 2011లో జరిగిన ఎన్నికలలో ఇతర పార్టీలతో కూటమిగా పోటీ చేసినప్పటి కంటే, ఈసారి ఒంటరి పోటీలోనే మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు సాధిస్తోంది. దాదాపు మూడింట రెండొంతుల మెజారిటీకి దగ్గరగా ఉంది. అసోంలో 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న సీఎం తరుణ్ గొగోయ్ను కాదని, బీజేపీ నేత శర్వానంద సోనోవాల్కు ప్రజలు పట్టంగట్టారు. అలాగే కేరళలో అవినీతి ఆరోపణలలో కూరుకుపోయిన ఊమెన్ చాందీని దించి, ఎల్డీఎఫ్ కూటమిని గెలిపించారు. పుదుచ్చేరిలో మాత్రం హంగ్ అసెంబ్లీ ఏర్పడేలా ఉంది. వివిధ రాష్ట్రాలలో ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి..
పశ్చిమబెంగాల్ (294)
పార్టీ ఆధిక్యం గెలుపు
టీఎంసీ 62 154
లెఫ్ట్ 32 38
బీజేపీ 0 7
ఇతరులు 0 1
అసోం (126) ఆధిక్యం గెలుపు
బీజేపీ 37 51
కాంగ్రెస్ 15 08
ఏఐయూడీఎఫ్ 5 6
ఇతరులు 2 2
తమిళనాడు (234) ఆధిక్యం గెలుపు
అన్నాడీఎంకే 104 32
డీఎంకే 75 21
ఇతరులు 0 0
డీఎండీకే 0 0
కేరళ (140) ఆధిక్యం గెలుపు
ఎల్డీఎఫ్ 0 88
యూడీఎఫ్ 0 50
బీజేపీ 0 1
ఇతరులు 0 0
పుదుచ్చేరి (30) ఆధిక్యం గెలుపు
కాంగ్రెస్ 4 13
ఏఐఎన్ఆర్సీ 0 8
అన్నాడీఎంకే 1 3
ఇతరులు 0 1
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







