మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్బాబు చిత్రం మరికొద్ది రోజుల్లో..
- May 19, 2016
మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్బాబు కథానాయకుడుగా రూపుదిద్దుకోనున్న చిత్రం షూటింగ్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. 'బ్రహ్మోత్సవం' విడుదల తరువాత 15 రోజుల విరామం తీసుకుని ఈ చిత్రం షూటింగ్ను ప్రారంభించనున్నట్లు మహేశ్ ఇటీవల ఓ ఇంటర్వూలో పేర్కొన్నారు. 'మురుగదాస్ నా అభిమాన దర్శకుడు. 'గజిని' నుంచే ఆయనతో ఓ సినిమా చేయాలని ఎదురుచూస్తున్నా. నా 'ఒక్కడు' సినిమా అంటే ఆయనకు చాలా ఇష్టం. 'శ్రీమంతుడు' ప్రచారంలో భాగంగా ఓ సారి చెన్నై వెళ్లా. అప్పుడు మురుగదాస్ని కలిశా. ఆయన ఓ లైన్ చెప్పారు. చాలా బాగా నచ్చింది. ఎన్వీ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తారు. 'బ్రహ్మోత్సవం' తరువాత 15 రోజులు విశ్రాంతి తీసుకుని చిత్రీకరణ మొదలెడతాం' అని మహేశ్ తెలిపారు. ఈ చిత్రంలో కథానాయికగా బాలీవుడ్ నటి పరిణీతీ చోప్రాను అనుకుంటున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







