రామ్, రకుల్ ప్రీత్ సింగ్ తో జోడి...
- May 19, 2016
చాలా రోజులుగా ఓ బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురుచూసిన యంగ్ హీరో రామ్, నేను శైలజ సినిమాతో అనుకున్నది సాధించాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన నేను శైలజ, రామ్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సక్సెస్ తరువాత ఎలాంటి సినిమా చేయాలన్న ఆలోచనతో చాలా రోజులు గడిపేసిన రామ్ ఫైనల్ గా కందిరీగ కాంబినేషన్ లో సినిమా అంగీకరించాడు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు హీరోయిన్ ను వెతికే పనిలో ఉన్నారు చిత్రయూనిట్.ముందుగా సినిమాలో తమన్నాను హీరోయిన్ గా తీసుకోవాలని భావించారు, అయితే గతంలో రామ్, తమన్నాల కాంబినేషన్ లో వచ్చిన ఎందుకంటే ప్రేమంట ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో తమన్నా కన్నా రాశీఖన్నా బెటర్ అని ఫీల్ అయ్యారు. అయితే రామ్, రాశీతో జోడి కట్టిన శివం సినిమా రిజల్ట్ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవటంతో రామ్ మరోసారి ఆలోచనలో పడ్డాడు. ఫైనల్ గా తనతో సక్సెస్ ఫుల్ పెయిర్ అనిపించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ తో జోడి కట్టేందుకు ఫిక్స్ అయ్యాడు రామ్. పండగచేస్కో సినిమాతో పర్వాలేదని పించిన ఈ జంట ఇప్పుడు మరోసారి వెండితెర మీద సందడి చేయడానికి రెడీ అవుతోంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







