ఇరాన్-సౌదీ సంబంధాల్లో కీలక ముందడుగు..!
- September 06, 2023
టెహ్రాన్: ఇరాన్ మరియు సౌదీ అరేబియా ఈ ప్రాంతంతోపాటు ఇస్లామిక్ ప్రపంచంలో రెండు ప్రభావవంతమైన దేశాలని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అన్నారు. మెరుగైన ఇరాన్-సౌదీ సంబంధాలు ఈ ప్రాంతంలో విదేశీ జోక్యాల పరిధిని తగ్గించగలవని రైసీ చెప్పారు. సౌదీ అరేబియాకు నియమించబడిన ఇరాన్ రాయబారి అలీరెజా ఎనయాటి రియాద్కు బయలుదేరే ముందు ఇరాన్ అధ్యక్షుడిని కలిసారు. టెహ్రాన్, రియాద్ మధ్య సంబంధాలను మరింత ప్రోత్సహించాలని ఈ సందర్భంగా రైసీ పిలుపునిచ్చారు. 2023 మార్చి 10న బీజింగ్లో చైనా మధ్యవర్తిత్వం వహించిన చారిత్రాత్మక ఒప్పందంలో సౌదీ అరేబియా, ఇరాన్ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలను పునఃప్రారంభించాలని.. ఏడేళ్ల విరామం తర్వాత తమ దౌత్య కార్యకలాపాలను పునఃప్రారంభించాలని నిర్ణయించుకున్నాయి. మరోవైపు ఇరాన్లో సౌదీ అరేబియా కొత్త రాయబారి అబ్దుల్లా అల్-ఎనెజీ మంగళవారం తన బాధ్యతలను స్వీకరించేందుకు ఇరాన్ రాజధాని టెహ్రాన్ చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న ఆయనకు ఇరాన్ సీనియర్ అధికారులు స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!









