యూఏఈ తీరంలో కూలిన హెలికాప్టర్‌. పైలట్లు మృతి..!

- September 09, 2023 , by Maagulf
యూఏఈ తీరంలో కూలిన హెలికాప్టర్‌. పైలట్లు మృతి..!

యూఏఈ : యూఏఈ తీరంలో హెలికాప్టర్‌ కుప్పకూలింది.  ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మృతి చెందినట్లు జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (GCAA)లోని ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ సెక్టార్ వెల్లడించింది. మృతుల కుటుంబానికి అధికార యంత్రాంగం తన ప్రగాఢ   సానుభూతిని తెలియజేసింది. సెప్టెంబర్ 7 రాత్రి 8.30 గంటలకు యూఏఈ తీరంలో హెలికాప్టర్ క్రాష్ అయినట్లు GCAA తెలిపింది. A6-ALD రిజిస్ట్రేషన్ మార్క్‌తో ఏరోగల్ఫ్ యాజమాన్యంలోని 'బెల్ 212' ఛాపర్ ఈజిప్టు, దక్షిణాఫ్రికా దేశాలకు చెందిన ఇద్దరు పైలట్‌లతో రాత్రి శిక్షణా సెషన్ లో ఉండగా గల్ఫ్ సముద్రంలో కూలిపోయిందని GCAA తెలిపింది. ఇది మొదట అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిందని పేర్కొంది. అధికార యంత్రాంగం శిథిలాల కోసం గాలిస్తుంది. అధికారిక మూలాల నుండి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని,  పుకార్లను నమ్మవద్దని, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని ప్రజలకు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com