G20 సమ్మిట్ కోసం భారత్ బయలుదేరిన సౌదీ క్రౌన్ ప్రిన్స్

- September 09, 2023 , by Maagulf
G20 సమ్మిట్ కోసం భారత్ బయలుదేరిన సౌదీ క్రౌన్ ప్రిన్స్

రియాద్: రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ ఆదేశాల మేరకు సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్,  ప్రధాన మంత్రి ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ శుక్రవారం భారత పర్యటనకు బయలుదేరారు. భారత ప్రధాని నుండి వచ్చిన ఆహ్వానంతో న్యూఢిల్లీలో జరగనున్న G20 నేతల శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. తన పర్యటనలో క్రౌన్ ప్రిన్స్ ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర ఆసక్తి ఉన్న విషయాలతో సహా అనేక రకాల అంశాలను కవర్ చేసే చర్చలలో పాల్గొంటారు. దీనితోపాటు  సౌదీ-ఇండియన్ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ కౌన్సిల్ యొక్క ముఖ్యమైన సమావేశంలో పాల్గొంటారు.  ఈ పర్యటన అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం, భారతదేశంతో దాని సంబంధాలను బలోపేతం చేయడం, అలాగే G20 వంటి ప్రపంచ ఫోరమ్‌లలో దాని చురుకైన ప్రాతినిధ్యం వహించనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com