G20లో ప్రపంచ నాయకులకు భారత్ స్వాగతం.. తొలిరోజు ఎజెండా ఇదే
- September 09, 2023
యూఏఈ: 18వ G20 సమ్మిట్కు హాజరవుతున్న ప్రపంచ నాయకులతో భారత రాజధాని న్యూఢిల్లీ సందడిగా మారింది. ప్రపంచ నాయకులకు భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. ఈ సమ్మిట్కు 30 మందికి పైగా దేశాధినేతలు, యూరోపియన్ యూనియన్ , ఆహ్వానిత అతిథి దేశాలు , 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు, ఉన్నతాధికారులు హాజరవుతున్నారు. సెప్టెంబర్ 9-10 తేదీలలో G20 లీడర్స్ సమ్మిట్ జరుగనుంది.
G20 సమ్మిట్ యొక్క మొదటి సెషన్లో 'వన్ ఎర్త్' జరుగింది. G20 లీడర్స్ సమ్మిట్లో సెషన్లో వన్ ఎర్త్ ప్రధాన చర్చ సాగింది. ముఖ్యంగా, భారతదేశం అధ్యక్షతన జరుగుతున్న ఈ సంవత్సరం G20 సమ్మిట్ యొక్క థీమ్ “వసుధైవ కుటుంబం” లేదా “ఒకే భూమి · ఒక కుటుంబం · ఒక భవిష్యత్తు” - మహా ఉపనిషత్ యొక్క ప్రాచీన సంస్కృత గ్రంథం నుండి తీసుకోబడింది. 'వన్ ఎర్త్' సెషన్ ముగిసిన తర్వాత లంచ్ కార్యక్రమం జరిగింది. మధ్యాహ్నం 3.00 గంటలకు 'వన్ ఫ్యామిలీ' మరో సెషన్ నిర్వహించారు. అతిధులకు సాయంత్రం 7:00 గంటలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఇవ్వనున్నారు. దేశ రాజధాని నగరంలో జరిగే ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా తదితరులు హాజరయ్యారు. ఈ సదస్సులో చైనాకు చైనా ప్రధాని లీ కియాంగ్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, రష్యా తరపున రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!







