G20లో ప్రపంచ నాయకులకు భారత్ స్వాగతం.. తొలిరోజు ఎజెండా ఇదే
- September 09, 2023
యూఏఈ: 18వ G20 సమ్మిట్కు హాజరవుతున్న ప్రపంచ నాయకులతో భారత రాజధాని న్యూఢిల్లీ సందడిగా మారింది. ప్రపంచ నాయకులకు భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. ఈ సమ్మిట్కు 30 మందికి పైగా దేశాధినేతలు, యూరోపియన్ యూనియన్ , ఆహ్వానిత అతిథి దేశాలు , 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు, ఉన్నతాధికారులు హాజరవుతున్నారు. సెప్టెంబర్ 9-10 తేదీలలో G20 లీడర్స్ సమ్మిట్ జరుగనుంది.
G20 సమ్మిట్ యొక్క మొదటి సెషన్లో 'వన్ ఎర్త్' జరుగింది. G20 లీడర్స్ సమ్మిట్లో సెషన్లో వన్ ఎర్త్ ప్రధాన చర్చ సాగింది. ముఖ్యంగా, భారతదేశం అధ్యక్షతన జరుగుతున్న ఈ సంవత్సరం G20 సమ్మిట్ యొక్క థీమ్ “వసుధైవ కుటుంబం” లేదా “ఒకే భూమి · ఒక కుటుంబం · ఒక భవిష్యత్తు” - మహా ఉపనిషత్ యొక్క ప్రాచీన సంస్కృత గ్రంథం నుండి తీసుకోబడింది. 'వన్ ఎర్త్' సెషన్ ముగిసిన తర్వాత లంచ్ కార్యక్రమం జరిగింది. మధ్యాహ్నం 3.00 గంటలకు 'వన్ ఫ్యామిలీ' మరో సెషన్ నిర్వహించారు. అతిధులకు సాయంత్రం 7:00 గంటలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఇవ్వనున్నారు. దేశ రాజధాని నగరంలో జరిగే ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా తదితరులు హాజరయ్యారు. ఈ సదస్సులో చైనాకు చైనా ప్రధాని లీ కియాంగ్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, రష్యా తరపున రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









