మొరాకో భూకంపం: 2,000 దాటిన మృతుల సంఖ్య..!
- September 10, 2023
యూఏఈ: మొరాకోలో సంభవించిన శక్తివంతమైన భూకంపంలో మరణించిన వారి సంఖ్య 2,000 దాటింది. వేల మందికి పైగా గాయపడ్డారు. అందులో కొందరి పరిస్థితి సీరియస్ గా ఉందని ఆ దేశ మంత్రిత్వ శాఖ ప్రకటన తెలిపింది. ఈ భూకంపంలో కనీసం 2,012 మంది చనిపోయారని, 2,059 మంది గాయపడ్డారని, వీరిలో 1,404 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. భూకంప కేంద్రమైన అల్-హౌజ్ ప్రావిన్స్లో 1,293 మంది మరణించగా.. టరౌడెంట్ ప్రావిన్స్లో 452 మంది మరణించారని పేర్కొంది. మొరాకోలోని హై అట్లాస్ పర్వతాలలో శుక్రవారం అర్థరాత్రి 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. చాలా మరణాలు భూకంప కేంద్రానికి సమీప నగరమైన మర్రకేచ్ వెలుపల ఉన్న పర్వత ప్రాంతాలలో సంభవించాయి.
తాజా వార్తలు
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!
- పుణే మర్డర్ కేసు..సియా గోయల్ సోదరుడికి రూ.10 కోట్లు జరిమానా
- 'ది గేమ్చేంజర్స్ మిడిల్ ఈస్ట్'కు భారీ స్పందన..1,500 స్టార్టప్ దరఖాస్తులు
- ఎతిహాద్ రైల్కు విశేష స్పందన.. తొలి ప్రయాణానికి ముందే 10 వేలకు పైగా టికెట్ల విక్రయం







