మొరాకో భూకంపం: 2,000 దాటిన మృతుల సంఖ్య..!

- September 10, 2023 , by Maagulf
మొరాకో భూకంపం: 2,000 దాటిన మృతుల సంఖ్య..!

యూఏఈ: మొరాకోలో సంభవించిన శక్తివంతమైన భూకంపంలో మరణించిన వారి సంఖ్య 2,000 దాటింది. వేల మందికి పైగా గాయపడ్డారు. అందులో కొందరి పరిస్థితి సీరియస్ గా ఉందని  ఆ దేశ మంత్రిత్వ శాఖ ప్రకటన తెలిపింది. ఈ భూకంపంలో కనీసం 2,012 మంది చనిపోయారని, 2,059 మంది గాయపడ్డారని, వీరిలో 1,404 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. భూకంప కేంద్రమైన అల్-హౌజ్ ప్రావిన్స్‌లో 1,293 మంది మరణించగా.. టరౌడెంట్ ప్రావిన్స్‌లో 452 మంది మరణించారని పేర్కొంది. మొరాకోలోని హై అట్లాస్ పర్వతాలలో శుక్రవారం అర్థరాత్రి 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. చాలా మరణాలు భూకంప కేంద్రానికి సమీప నగరమైన మర్రకేచ్ వెలుపల ఉన్న పర్వత ప్రాంతాలలో సంభవించాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com