మొరాకో భూకంపం: 2,000 దాటిన మృతుల సంఖ్య..!
- September 10, 2023
యూఏఈ: మొరాకోలో సంభవించిన శక్తివంతమైన భూకంపంలో మరణించిన వారి సంఖ్య 2,000 దాటింది. వేల మందికి పైగా గాయపడ్డారు. అందులో కొందరి పరిస్థితి సీరియస్ గా ఉందని ఆ దేశ మంత్రిత్వ శాఖ ప్రకటన తెలిపింది. ఈ భూకంపంలో కనీసం 2,012 మంది చనిపోయారని, 2,059 మంది గాయపడ్డారని, వీరిలో 1,404 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. భూకంప కేంద్రమైన అల్-హౌజ్ ప్రావిన్స్లో 1,293 మంది మరణించగా.. టరౌడెంట్ ప్రావిన్స్లో 452 మంది మరణించారని పేర్కొంది. మొరాకోలోని హై అట్లాస్ పర్వతాలలో శుక్రవారం అర్థరాత్రి 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. చాలా మరణాలు భూకంప కేంద్రానికి సమీప నగరమైన మర్రకేచ్ వెలుపల ఉన్న పర్వత ప్రాంతాలలో సంభవించాయి.
తాజా వార్తలు
- కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
- భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025
- బహ్రెయిన్-భారత్ చర్చలు..వాణిజ్యం, భద్రత మరియు ప్రాంతీయ శాంతిపై దృష్టి..!!
- బిగ్ టికెట్ డ్రాలో Dh25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు..!!
- యూనిఫైడ్ GCC వీసాపై క్లారిటీ ఇచ్చిన సౌదీ పర్యాటక మంత్రి..!!
- కువైట్ రైల్వే ప్రాజెక్ట్.. రైల్వే స్టేషన్ మొదటి దశ పూర్తి..!!
- సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్..!!
- ఒమన్ చోరీ కేసులలో పలువురి అరెస్టు..!!
- తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
- బ్రిటన్లో ఆరోగ్య రంగంలో నారాయణ హెల్త్ పెద్ద అడుగు!







