మొరాకో భూకంపం: 2,000 దాటిన మృతుల సంఖ్య..!
- September 10, 2023
యూఏఈ: మొరాకోలో సంభవించిన శక్తివంతమైన భూకంపంలో మరణించిన వారి సంఖ్య 2,000 దాటింది. వేల మందికి పైగా గాయపడ్డారు. అందులో కొందరి పరిస్థితి సీరియస్ గా ఉందని ఆ దేశ మంత్రిత్వ శాఖ ప్రకటన తెలిపింది. ఈ భూకంపంలో కనీసం 2,012 మంది చనిపోయారని, 2,059 మంది గాయపడ్డారని, వీరిలో 1,404 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. భూకంప కేంద్రమైన అల్-హౌజ్ ప్రావిన్స్లో 1,293 మంది మరణించగా.. టరౌడెంట్ ప్రావిన్స్లో 452 మంది మరణించారని పేర్కొంది. మొరాకోలోని హై అట్లాస్ పర్వతాలలో శుక్రవారం అర్థరాత్రి 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. చాలా మరణాలు భూకంప కేంద్రానికి సమీప నగరమైన మర్రకేచ్ వెలుపల ఉన్న పర్వత ప్రాంతాలలో సంభవించాయి.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









