చక్కెర వ్యాధి.. లాభాలు.!

- May 19, 2016 , by Maagulf
చక్కెర వ్యాధి.. లాభాలు.!

ఏంటిది.. మహమ్మారి షుగర్ వ్యాధితో లాభాలేంటనుకుంటున్నారా.. రోగులకు కాదు, షుగర్ వ్యాధికి మందులు తయారు చేసే సంస్థలకు.. ట్రీట్మెంట్ చేసే డాక్టర్లకు. రానురాను ఆయా మందుల తయారీ సంస్థలకు, డయాబెటీస్ ప్రాఫిట్స్ పెరిగిపోతున్నాయి. మెడికల్ ఫ్రాటర్నిటీకి ఇవి కాసులు కురిపిస్తున్నాయి.
2005లో భారత్లో షుగర్ వ్యాధి బాధితుల సంఖ్య 40 మిలియన్లు కాగా, 2015 నాటికి 65.1 మిలియన్లకు, 2030 నాటికి 30 మిలియన్లకు చేరుతుందని లెక్కలు చెబుతున్నాయి. షుగర్ వ్యాధి బాధితుల సగటు నెలసరి ఖర్చులు పెరిగిపోతున్నాయి. డాక్టర్‌ను సంప్రదించేందుకు ఒక్కో పేషెంటూ నెలకు 700 నుంచి వెయ్యి రూపాయలు, రెగ్యులర్ ల్యాబ్ టెస్టులకు 5 నుంచి 7 వందలు, మెడిసిన్స్, ఇన్సులిన్ తదితరాలకు దాదాపు 6వేల వరకూ ఖర్చయిపోతున్నాడని వాల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్వహించిన శాంపిల్ సర్వే చెబుతోంది.

అంతేకాదు, రాబోయే 5 ఏళ్ల కాలంలో 50వేలు, పదేళ్ల కాలంలో 80వేలు, 20ఏళ్ల కాలంలో లక్ష చొప్పున షుగర్ బాధితులు ప్రతి ఏడాదీ తమ ట్రీట్మెంట్‌కు సమర్పించుకోవాల్సిన పరిస్థితి దాపురించే అవకాశం కనిపిస్తోంది. చిన్నవయుసులోనే షుగర్ బారిన పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వ్యాధి నియంత్రణ, నివారణకు సరికొత్త చౌకైన మందులు రావాల్సిన అవసరం ఎంతో కనిపిస్తోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com