చక్కెర వ్యాధి.. లాభాలు.!
- May 19, 2016
ఏంటిది.. మహమ్మారి షుగర్ వ్యాధితో లాభాలేంటనుకుంటున్నారా.. రోగులకు కాదు, షుగర్ వ్యాధికి మందులు తయారు చేసే సంస్థలకు.. ట్రీట్మెంట్ చేసే డాక్టర్లకు. రానురాను ఆయా మందుల తయారీ సంస్థలకు, డయాబెటీస్ ప్రాఫిట్స్ పెరిగిపోతున్నాయి. మెడికల్ ఫ్రాటర్నిటీకి ఇవి కాసులు కురిపిస్తున్నాయి.
2005లో భారత్లో షుగర్ వ్యాధి బాధితుల సంఖ్య 40 మిలియన్లు కాగా, 2015 నాటికి 65.1 మిలియన్లకు, 2030 నాటికి 30 మిలియన్లకు చేరుతుందని లెక్కలు చెబుతున్నాయి. షుగర్ వ్యాధి బాధితుల సగటు నెలసరి ఖర్చులు పెరిగిపోతున్నాయి. డాక్టర్ను సంప్రదించేందుకు ఒక్కో పేషెంటూ నెలకు 700 నుంచి వెయ్యి రూపాయలు, రెగ్యులర్ ల్యాబ్ టెస్టులకు 5 నుంచి 7 వందలు, మెడిసిన్స్, ఇన్సులిన్ తదితరాలకు దాదాపు 6వేల వరకూ ఖర్చయిపోతున్నాడని వాల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్వహించిన శాంపిల్ సర్వే చెబుతోంది.
అంతేకాదు, రాబోయే 5 ఏళ్ల కాలంలో 50వేలు, పదేళ్ల కాలంలో 80వేలు, 20ఏళ్ల కాలంలో లక్ష చొప్పున షుగర్ బాధితులు ప్రతి ఏడాదీ తమ ట్రీట్మెంట్కు సమర్పించుకోవాల్సిన పరిస్థితి దాపురించే అవకాశం కనిపిస్తోంది. చిన్నవయుసులోనే షుగర్ బారిన పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వ్యాధి నియంత్రణ, నివారణకు సరికొత్త చౌకైన మందులు రావాల్సిన అవసరం ఎంతో కనిపిస్తోంది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







