కొత్త పార్లమెంటులో మంగళవారమే తొలి సమావేశం..
- September 18, 2023
న్యూ ఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. అయితే వర్షాకాల సాధారణ సమావేశాల్లోనే నూతన పార్లమెంట్ భవనంలో సమావేశాలు ప్రారంభమవుతాయని స్వయంగా కేంద్ర మంత్రి ఒకరు చెప్పినప్పటికీ అది ఆచరణలో సాధ్యం కాలేదు. కాగా, తాజాగా ప్రత్యేక సమావేశాల సందర్భంగా నూతన భవనంలోని పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 2:15 గంటలకు రాజ్యసభ సమావేశం కానుంది. ఇక నుంచి నూతన భవనంలోనే పార్లమెంట్ కార్యకలాపాలు కొనసాగనున్నాయి.
నూతన పార్లమెంట్ భవనాన్ని మే 28న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రధాని మోదీతో పాటు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూడా హాజరయ్యారు. కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడానికి ముందు ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కొత్త పార్లమెంటు భవనంలో మహాత్మా గాంధీకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాసేపు లోక్ సభ హాలులో సమావేశం జరిగింది.
తాజా వార్తలు
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు
- హై-టెక్ సేవలను ప్రారంభించిన రాయల్ హాస్పిటల్..!!
- జూలై 1 నుండి 31 వరకు ఖతార్ టాయ్ ఫెస్టివల్..!!
- బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణ పై స్పెషల్ ఫోకస్..!!
- కువైట్ లో మే 3 నుండి వైద్య సిబ్బందికి సెలవులు..!!
- ఆన్లైన్ కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు..!!
- భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!









