ఆర్థిక మంత్రిత్వ శాఖ నెట్వర్క్ పై సైబర్ దాడి..!

- September 19, 2023 , by Maagulf
ఆర్థిక మంత్రిత్వ శాఖ నెట్వర్క్ పై సైబర్ దాడి..!

కువైట్: తమ నెట్వర్క్ పై సైబర్‌టాక్‌ జరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. భద్రత, రక్షణ ప్రోటోకాల్ సిస్టమ్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగినట్లు పేర్కొంది. ప్రమాదాన్ని గుర్తించిన నిపుణులు హార్డ్‌వేర్ పరికరాలను డిస్‌కనెక్ట్ చేసి వేరు చేసారని తెలిపింది. అయితే, ప్రభుత్వ ఫైనాన్షియల్ సర్వర్లను హ్యాక్ చేయడానికి ప్రయత్నించారని, కానీ సాలరీ బదిలీ నెట్వర్క్ ప్రభావితం కాలేదని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హ్యాక్‌కు సంబంధించిన అప్‌డేట్‌ల కోసం మంత్రిత్వ శాఖ నేషనల్ సైబర్‌సెక్యూరిటీ సెంటర్‌తో సంప్రదింపులు జరుపుతోందని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com