ఆర్థిక మంత్రిత్వ శాఖ నెట్వర్క్ పై సైబర్ దాడి..!
- September 19, 2023
కువైట్: తమ నెట్వర్క్ పై సైబర్టాక్ జరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. భద్రత, రక్షణ ప్రోటోకాల్ సిస్టమ్ను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగినట్లు పేర్కొంది. ప్రమాదాన్ని గుర్తించిన నిపుణులు హార్డ్వేర్ పరికరాలను డిస్కనెక్ట్ చేసి వేరు చేసారని తెలిపింది. అయితే, ప్రభుత్వ ఫైనాన్షియల్ సర్వర్లను హ్యాక్ చేయడానికి ప్రయత్నించారని, కానీ సాలరీ బదిలీ నెట్వర్క్ ప్రభావితం కాలేదని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హ్యాక్కు సంబంధించిన అప్డేట్ల కోసం మంత్రిత్వ శాఖ నేషనల్ సైబర్సెక్యూరిటీ సెంటర్తో సంప్రదింపులు జరుపుతోందని తెలిపింది.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









