పాఠశాల రవాణా రుసుమును 78% తగ్గించిన ఖతార్
- September 19, 2023
దోహా: తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తగ్గించే దిశగా విద్యాశాఖ, ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. పాఠశాల రవాణా రుసుములో 78% తగ్గింపును ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న మరియు నాన్-జిసిసి పౌరులు అయిన ఖతారీయేతర విద్యార్థులకు ప్రతి సెమిస్టర్ రవాణా రుసుము QAR 220గా నిర్ణయించబడిందని విద్యాశాఖ మంత్రి బుతైనా బింట్ అలీ అల్ జబ్ర్ అల్ నుయిమి తెలిపారు. రవాణా రుసుములు గతంలో ఒక్కో సెమిస్టర్కు ఒక్కో విద్యార్థికి QAR 1,000గా ఉన్నందున, తాజాగా వాటిని 78% మేరకు తగ్గించినట్లు వెల్లడించారు. దీంతోపాటు మినిస్ట్రీ ఆఫ్ ఎండోమెంట్స్, ఇస్లామిక్ అఫైర్స్తో అనుబంధంగా ఉన్న ఇమామ్లు మరియు మ్యూజిన్ల పిల్లలకు పుస్తకాల ధర, రవాణా రుసుము నుండి మినహాయింపు ఇవ్వాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
అందరికీ నాణ్యమైన విద్యను అందించాలనే దాని దృక్పథానికి అనుగుణంగా తాజా నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతి సెమిస్టర్కు ప్రతి విద్యార్థికి పాఠ్యపుస్తకాల ధర QAR 150గా నిర్ణయించబడిందని పేర్కొంది. అదే సమయంలో ఖతార్ మహిళలు, వికలాంగుల పిల్లలకు పుస్తకాల ధర..వాణా ఛార్జీలను చెల్లించకుండా మినహాయించారు. 2023/2024 విద్యా సంవత్సరం ప్రారంభం నుండి ఈ నిర్ణయం అమలు చేయబడుతుందని విద్యాశాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- ఇరాన్ పోర్టులో భారీ పేలుడు.. 400 మందికి పైగా గాయాలు
- TGSRTC : త్వరలో హైదరాబాద్ కి 150 ఎలక్ట్రిక్ బస్సులు
- అబుదాబిలో అపార్ట్మెంట్ నుండి పడి యువకుడు మృతి..!!
- 17.6 కిలోల మెథాంఫేటమిన్ రవాణాను అడ్డుకున్న జాక్టా..!!
- కువైట్ లో అక్రమ క్రిప్టోకరెన్సీ మైనింగ్ కార్యకలాపాలపై ప్రచారం..!!
- దహిరాలో థర్డ్ స్కౌట్ క్యాంప్ అల్ ప్రారంభం..!!
- అల్ డైర్ సముద్ర తీరప్రాంతానికి ఫిషింగ్, సిట్టింగ్ ప్లాట్ఫామ్..!!
- ఖలీఫా అంతర్జాతీయ స్టేడియం.. మే 24న అమీర్ కప్ ఫైనల్కు ఆతిథ్యం..!!
- అమెరికాలో విదేశీ విద్యార్థులు హ్యాపీ
- విశాఖలో తలసేమియా బాధితుల కోసం మే 8న భరోసా కల్పిద్దాం-నారా భువనేశ్వరి