పాఠశాల రవాణా రుసుమును 78% తగ్గించిన ఖతార్
- September 19, 2023![1 పాఠశాల రవాణా రుసుమును 78% తగ్గించిన ఖతార్](https://www.maagulf.com/godata/articles/202309/eee_1695091418.jpg)
దోహా: తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తగ్గించే దిశగా విద్యాశాఖ, ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. పాఠశాల రవాణా రుసుములో 78% తగ్గింపును ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న మరియు నాన్-జిసిసి పౌరులు అయిన ఖతారీయేతర విద్యార్థులకు ప్రతి సెమిస్టర్ రవాణా రుసుము QAR 220గా నిర్ణయించబడిందని విద్యాశాఖ మంత్రి బుతైనా బింట్ అలీ అల్ జబ్ర్ అల్ నుయిమి తెలిపారు. రవాణా రుసుములు గతంలో ఒక్కో సెమిస్టర్కు ఒక్కో విద్యార్థికి QAR 1,000గా ఉన్నందున, తాజాగా వాటిని 78% మేరకు తగ్గించినట్లు వెల్లడించారు. దీంతోపాటు మినిస్ట్రీ ఆఫ్ ఎండోమెంట్స్, ఇస్లామిక్ అఫైర్స్తో అనుబంధంగా ఉన్న ఇమామ్లు మరియు మ్యూజిన్ల పిల్లలకు పుస్తకాల ధర, రవాణా రుసుము నుండి మినహాయింపు ఇవ్వాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
అందరికీ నాణ్యమైన విద్యను అందించాలనే దాని దృక్పథానికి అనుగుణంగా తాజా నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతి సెమిస్టర్కు ప్రతి విద్యార్థికి పాఠ్యపుస్తకాల ధర QAR 150గా నిర్ణయించబడిందని పేర్కొంది. అదే సమయంలో ఖతార్ మహిళలు, వికలాంగుల పిల్లలకు పుస్తకాల ధర..వాణా ఛార్జీలను చెల్లించకుండా మినహాయించారు. 2023/2024 విద్యా సంవత్సరం ప్రారంభం నుండి ఈ నిర్ణయం అమలు చేయబడుతుందని విద్యాశాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- రెసిడెన్సీ చట్టం ఉల్లంఘన..తనిఖీల్లో పలువురు అరెస్ట్
- అత్యున్నత ప్రపంచ ప్రమాణాలతో ఖతార్ ఏవియేషన్ రంగం..!
- పారిస్ ఒలింపిక్స్ 2024: అట్టహాసంగా ఆరంభ వేడుకలు..
- ఒమన్లో ధూళి తుఫానులు..అలెర్ట్ జారీ
- నవజాత శిశువుల స్క్రీనింగ్.. యూఏఈలో కొత్త మార్గదర్శకాలు
- 'మాస్టర్ ఆఫ్ డవలప్ మెంట్ ఎక్సలెన్స్ అవార్డు-2024'ను సొంతం చేసుకున్న అన్వితా గ్రూప్
- రేపటి భారత క్రీడా షెడ్యూల్ ఇదే..
- మద్యం కుంభకోణంలో జగన్ ను వదిలేది లేదు: మంత్రి కొల్లు రవీంద్ర
- షిర్డీ సాయినాధుని సేవలో ఏపీ గవర్నర్
- ఆసియా కప్: పాక్ పై విజయం…ఫైనల్స్ కు శ్రీలంక