43 కార్ ఏజెంట్లు, పంపిణీదారులపై క్రిమినల్ కేసులు నమోదు
- September 19, 2023
జెడ్డా: పోటీ చట్టాన్ని ఉల్లంఘించినందుకు 43 కార్ ఏజెంట్లు, పంపిణీదారులపై మరియు అనేక ఇతర రంగాలలోని 24 సంస్థలపై కేసులు నమోదు చేసినట్లు సౌదీ జనరల్ అథారిటీ ఫర్ కాంపిటీషన్ (GAC) వెల్లడించింది. ఆటోమొబైల్, స్పేర్ పార్ట్లు మరియు అమ్మకాల తర్వాత సేవల విభాగంలోని దర్యాప్తు ఫలితాలను సమీక్షించామని, ఇందులో 70 సంస్థలపై 128 పరిశోధనలు ఉన్నాయని, 43 సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించామని, పరిశోధనలు కొనసాగుతున్నాయని అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. అధికార యంత్రాంగం తొమ్మిది సంస్థలపై అవసరమైన చర్యలు తీసుకుందని తెలిపింది. కాంపిటీషన్ లా నిబంధనలను ఉల్లంఘించిన విషయంలో మూడు సంస్థలపై క్రిమినల్ వ్యాజ్యాలు దాఖలు చేయాలని నిర్ణయించినట్టు పేర్కొంది. SR7.7 మిలియన్ల ప్రాజెక్ట్లలో కుమ్మక్కయ్యారనే అనుమానంతో ఆరు సంస్థలపై కేసులను నమోదు చేయించినట్లు తెలిపింది.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రాజెక్ట్ల కోసం SR432800 మొత్తానికి బిడ్లు సమర్పించిన ఐదు సంస్థల అనుమానిత ఒప్పందంపై దర్యాప్తు ఫలితాలను GAC అధ్యయనం చేసింది. ఇందులో లోపాలు గుర్తించడంతో ఈ సంస్థలపై దావా వేయాలని నిర్ణయించింది. SR600 మిలియన్ల విలువ కలిగిన ఒక ప్రధాన కంపెనీ తయారీ ప్రాజెక్టులలో తమ బిడ్లను సమర్పించిన ఎనిమిది సంస్థల కుట్రపై దర్యాప్తు ఫలితాల ఆధారంగా ఆరు సంస్థలపై వ్యాజ్యాలు వేయాలని నిర్ణయించింది. పిల్లల కోసం ఆరోగ్య ఉత్పత్తి ధరలను ఏకీకృతం చేయడానికి మూడు ప్రధాన ఫార్మసీలు, నాలుగు రిటైల్ మార్కెట్ల మధ్య జరిగిన ఒప్పందంపై దర్యాప్తు ఫలితాలను సమీక్షించి ఆయా సంస్థలపై దావాలు వేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం
- ఢిల్లీలోని పాక్ హైకమిషన్లో ఐఎస్ఐ ఏజెంట్..
- ఎన్నారై టిడిపి చొరవతో ఒమాన్ నుండి ఏపీకి చేరుకున్న యువకులు
- ట్రంప్ మిడిలీస్ట్ పర్యటనను ప్రారంభం..తొలి విదేశీ పర్యటన..!!
- కువైట్ ప్రైవేట్ ఫార్మసీలలో 69 మెడిసిన్ ధరలపై నియంత్రణ..!!
- జాసిమ్ బిన్ హమద్ స్ట్రీట్ లో ట్రాఫిక్ ఆంక్షలు..మూసివేత..!!
- రియాద్లో బైక్ డెలివరీ ఆర్డర్లు నిలిపివేత..!!
- CBSE 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల..!!
- పార్కింగ్ వివాదం.. ముగ్గురు మహిళలను కాల్చిచంపిన నిందితుడు..!!
- జార్ఖండ్లో శస్త్రచికిత్స శిబిరాలు నిర్వహించిన శంకర నేత్రాలయ