ప్రయాణికులకు SR58 మిలియన్ల పరిహారం చెల్లించిన విమానయాన సంస్థలు
- September 19, 2023
రియాద్: 2021, 2022 సంవత్సరాల్లో ప్రయాణీకులకు జాతీయ విమానయాన కంపెనీలు చెల్లించిన మొత్తం పరిహారం SR58 మిలియన్లు అని జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (GACA) ప్రకటించింది. ఇది వినియోగదారుల హక్కులను పరిరక్షించడానికి కార్యనిర్వాహక నిబంధనలలో నిర్దేశించిన దానికి అనుగుణంగా ఉంటుందని పేర్కొంది. పరిహారం అందిందిచన కేసులు ప్రధానంగా విమాన రద్దు, విమాన ఆలస్యం, బ్యాగేజీ నష్టం, బ్యాగేజీని కోల్పోవడం వంటివి ఉన్నాయని GACA వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ అజీజ్ అల్దాహ్మాష్ వెల్లడించారు.
GACA గత నెలలో ప్రయాణీకుల హక్కులను పరిరక్షించడానికి కొత్త ఎగ్జిక్యూటివ్ రెగ్యులేషన్ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం అమల్లో ఉన్నదాని స్థానంలో ఇది నవంబర్ 20 నుండి అమల్లోకి వస్తుంది. టిక్కెట్ విలువలో 150- 200 శాతం వరకు పరిహారం పొందేందుకు అవకాశం ఉంటుంది. ప్రయాణీకుల లగేజీని పోగొట్టిన సమయంలో SR6568కి సమానమైన ఆర్థిక పరిహారాన్ని అందజేస్తారు. సామాను దెబ్బతినడం, లోపం లేదా ఆలస్యం అయిన సందర్భంలో ప్రయాణీకుడు SR6568వరకు ఆర్థిక పరిహారాన్ని పొందేందుకు అర్హులు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







