ప్రయాణికులకు SR58 మిలియన్ల పరిహారం చెల్లించిన విమానయాన సంస్థలు
- September 19, 2023
రియాద్: 2021, 2022 సంవత్సరాల్లో ప్రయాణీకులకు జాతీయ విమానయాన కంపెనీలు చెల్లించిన మొత్తం పరిహారం SR58 మిలియన్లు అని జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (GACA) ప్రకటించింది. ఇది వినియోగదారుల హక్కులను పరిరక్షించడానికి కార్యనిర్వాహక నిబంధనలలో నిర్దేశించిన దానికి అనుగుణంగా ఉంటుందని పేర్కొంది. పరిహారం అందిందిచన కేసులు ప్రధానంగా విమాన రద్దు, విమాన ఆలస్యం, బ్యాగేజీ నష్టం, బ్యాగేజీని కోల్పోవడం వంటివి ఉన్నాయని GACA వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ అజీజ్ అల్దాహ్మాష్ వెల్లడించారు.
GACA గత నెలలో ప్రయాణీకుల హక్కులను పరిరక్షించడానికి కొత్త ఎగ్జిక్యూటివ్ రెగ్యులేషన్ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం అమల్లో ఉన్నదాని స్థానంలో ఇది నవంబర్ 20 నుండి అమల్లోకి వస్తుంది. టిక్కెట్ విలువలో 150- 200 శాతం వరకు పరిహారం పొందేందుకు అవకాశం ఉంటుంది. ప్రయాణీకుల లగేజీని పోగొట్టిన సమయంలో SR6568కి సమానమైన ఆర్థిక పరిహారాన్ని అందజేస్తారు. సామాను దెబ్బతినడం, లోపం లేదా ఆలస్యం అయిన సందర్భంలో ప్రయాణీకుడు SR6568వరకు ఆర్థిక పరిహారాన్ని పొందేందుకు అర్హులు.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









