ప్రయాణికులకు SR58 మిలియన్ల పరిహారం చెల్లించిన విమానయాన సంస్థలు
- September 19, 2023రియాద్: 2021, 2022 సంవత్సరాల్లో ప్రయాణీకులకు జాతీయ విమానయాన కంపెనీలు చెల్లించిన మొత్తం పరిహారం SR58 మిలియన్లు అని జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (GACA) ప్రకటించింది. ఇది వినియోగదారుల హక్కులను పరిరక్షించడానికి కార్యనిర్వాహక నిబంధనలలో నిర్దేశించిన దానికి అనుగుణంగా ఉంటుందని పేర్కొంది. పరిహారం అందిందిచన కేసులు ప్రధానంగా విమాన రద్దు, విమాన ఆలస్యం, బ్యాగేజీ నష్టం, బ్యాగేజీని కోల్పోవడం వంటివి ఉన్నాయని GACA వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ అజీజ్ అల్దాహ్మాష్ వెల్లడించారు.
GACA గత నెలలో ప్రయాణీకుల హక్కులను పరిరక్షించడానికి కొత్త ఎగ్జిక్యూటివ్ రెగ్యులేషన్ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం అమల్లో ఉన్నదాని స్థానంలో ఇది నవంబర్ 20 నుండి అమల్లోకి వస్తుంది. టిక్కెట్ విలువలో 150- 200 శాతం వరకు పరిహారం పొందేందుకు అవకాశం ఉంటుంది. ప్రయాణీకుల లగేజీని పోగొట్టిన సమయంలో SR6568కి సమానమైన ఆర్థిక పరిహారాన్ని అందజేస్తారు. సామాను దెబ్బతినడం, లోపం లేదా ఆలస్యం అయిన సందర్భంలో ప్రయాణీకుడు SR6568వరకు ఆర్థిక పరిహారాన్ని పొందేందుకు అర్హులు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో విప్రో విస్తరణ
- ముహరఖ్ లో జాతీయ స్టేడియం..ఎంపీల ప్రతిపాదన..!!
- ఎన్విజన్ సిఇఓ లీ జంగ్ తో మంత్రి నారా లోకేష్ భేటీ
- డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ మాట్లాడుతున్నారా?
- మనీ ఎక్స్ఛేంజ్లో సాయుధ దోపిడీ..24 గంటల్లో నైజీరియన్ ముఠా అరెస్ట్..!!
- GCC స్థాయిలో మెటర్నిటీ లీవ్స్ రెగ్యులేషన్స్ పై వర్క్ షాప్..!!
- సౌక్ వాకిఫ్ ఈక్వెస్ట్రియన్ ఫెస్టివల్ 2025 సక్సెస్..!!
- దుబాయ్ లో టాక్సీ కంటే చౌకైనది.. బస్సు కంటే వేగవంతం..!!
- కాన్సస్లో దిగ్విజయంగా NATS బ్యాడ్మింటన్ టోర్నమెంట్
- తెలంగాణకు భారీ ఒప్పందం