ఓంకార్ అన్నయ్య మళ్లీ వస్తున్నాడోచ్.! ఈ సారి అంతకు మించి.!
- September 20, 2023
ఓం కార్ పేరు వినగానే బుల్లితెరపై పాపులర్ షోస్ గుర్తుకు వస్తాయ్. అలా పాపులర్ అయిన తన పాపులారిటీని పెద్ద తెరకీ ప్రసరించాడు యాంకర్ కమ్ ప్రొడ్యూసర్ అయిన ఓంకార్.
‘రాజుగారి గది’ సినిమాలతో వెండితెరపై ఓంకార్ ఫేమస్. అయితే, గత కొంత కాలంగా ఓంకార్ అన్నయ్య కాస్త జోరు తగ్గించాడు. మళ్లీ ఇప్పుడే జోరు పెంచినట్లు తెలుస్తోంది.
ఈ సారి బుల్లితెర కాదు, వెండి తెర కాదు.. ఓటీటీ తెరపై తన ప్రతాపం చూపించబోతున్నాడు. ప్రముఖ ఓటీటీ ఛానెల్ హాట్ స్టార్లో ఓ హారర్ వెబ్ సిరీస్కి శ్రీకారం చుట్టాడు ఓంకార్ అన్నయ్య.
త్వరలో ఈ సిరీస్ స్ర్టీమింగ్ కానుంది. ‘మ్యాన్షన్ 24’ అనే టైటిల్తో రూపొందిన ఈ వెబ్ సిరీస్ అబ్బుర పరిచే హారర్ అంశాలతో ఓటీటీ ప్రేక్షకులకి సరికొత్త థ్రిల్ ఇవ్వబోతోందట.
తాజాగా ఈ సిరీస్కి సంబంధించి ఓ పోస్టర్ రిలీజ్ చేసి ఈ విషయాన్ని కన్ఫామ్ చేశాడు ఓం కార్. అన్నట్లు ఈ సిరీస్లో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తోంది. చూడాలి మరి, బుల్లితెరపైనా, వెండితెరపైనా తనదైన గుర్తింపు చాటుకున్న ఓంకార్ ఓటీటీ తెరపై ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నాడో.!
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







