ఓంకార్ అన్నయ్య మళ్లీ వస్తున్నాడోచ్.! ఈ సారి అంతకు మించి.!
- September 20, 2023
ఓం కార్ పేరు వినగానే బుల్లితెరపై పాపులర్ షోస్ గుర్తుకు వస్తాయ్. అలా పాపులర్ అయిన తన పాపులారిటీని పెద్ద తెరకీ ప్రసరించాడు యాంకర్ కమ్ ప్రొడ్యూసర్ అయిన ఓంకార్.
‘రాజుగారి గది’ సినిమాలతో వెండితెరపై ఓంకార్ ఫేమస్. అయితే, గత కొంత కాలంగా ఓంకార్ అన్నయ్య కాస్త జోరు తగ్గించాడు. మళ్లీ ఇప్పుడే జోరు పెంచినట్లు తెలుస్తోంది.
ఈ సారి బుల్లితెర కాదు, వెండి తెర కాదు.. ఓటీటీ తెరపై తన ప్రతాపం చూపించబోతున్నాడు. ప్రముఖ ఓటీటీ ఛానెల్ హాట్ స్టార్లో ఓ హారర్ వెబ్ సిరీస్కి శ్రీకారం చుట్టాడు ఓంకార్ అన్నయ్య.
త్వరలో ఈ సిరీస్ స్ర్టీమింగ్ కానుంది. ‘మ్యాన్షన్ 24’ అనే టైటిల్తో రూపొందిన ఈ వెబ్ సిరీస్ అబ్బుర పరిచే హారర్ అంశాలతో ఓటీటీ ప్రేక్షకులకి సరికొత్త థ్రిల్ ఇవ్వబోతోందట.
తాజాగా ఈ సిరీస్కి సంబంధించి ఓ పోస్టర్ రిలీజ్ చేసి ఈ విషయాన్ని కన్ఫామ్ చేశాడు ఓం కార్. అన్నట్లు ఈ సిరీస్లో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తోంది. చూడాలి మరి, బుల్లితెరపైనా, వెండితెరపైనా తనదైన గుర్తింపు చాటుకున్న ఓంకార్ ఓటీటీ తెరపై ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నాడో.!
తాజా వార్తలు
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం









