కొత్త భద్రతా ఫీచర్లతో స్కూలు బస్సులు
- September 20, 2023
మస్కట్: ఒమన్ సుల్తానేట్ అంతటా కొత్త భద్రతా ఫీచర్లతో స్కూలు బస్సులు తిరగనున్నాయి. స్కూల్ బస్సుల తయారీ రంగంలో అగ్రగామిగా ఉన్న ఒమానీ కంపెనీ కర్వా మోటార్స్ కంపెనీ, విద్యార్థులు ప్రయాణిస్తున్నప్పుడు వారి భద్రతను నిర్ధారించడానికి అత్యున్నత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించబడిన పాఠశాల బస్సుల సరికొత్త మోడల్ను మంగళవారం విడుదల చేసింది. 2024 ప్రారంభం నాటికి ఒమన్ దేశీయ మార్కెట్లో సరికొత్త స్కూల్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. కార్వా స్కూల్ బస్సులో "దర్బ్ అస్సలామా" (సురక్షిత ప్రయాణం) వ్యవస్థకు అనుగుణంగా సరికొత్త భద్రతా పరికరాలు మరియు సిస్టమ్లు ఉంటాయి అని కార్వా మోటార్స్ సీఈఓ డాక్టర్ ఇబ్రహీం అలీ అల్ బలూషి వెల్లడించింది. ఈ బస్సులను ఒమన్ విద్యా మంత్రిత్వ శాఖ ఆమోదించిందని తెలిపారు. కొత్త బస్సులో 23 మంది విద్యార్థులు వెళ్లవచ్చని, సీటింగ్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందని, సీసీకెమెరాలు, అగ్నినిరోధక సాధానాలు బస్సులో ఉంటాయన్నారు. “పాఠశాల బస్సులో అధిక-నాణ్యత ఎయిర్ కండిషనింగ్, సేఫ్టీ డోర్స్ లాక్, సెన్సార్ సిస్టమ్తో కూడిన సైడ్ డోర్ల వ్యవస్థ, GPS సాంకేతికత ద్వారా బస్ లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్, డ్రైవర్ పనితీరును పర్యవేక్షించే వ్యవస్థను కూడా కలిగి ఉంటుంది.’’ అని అల్ బలూషి వివరించారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







