కార్మికులను సత్కరించిన దుబాయ్ పోలీసులు
- September 20, 2023
యూఏఈ: దుబాయ్లోని ఒక ఇంధన స్టేషన్లోని కార్మికులను దుబాయ్ పోలీసులు సత్కరించారు. ఇటీవల ఓ వాహనం అగ్ని ప్రమాదంపై వేగంగా మరియు సమర్థవంతంగా స్పందించినందుకు పోలీసులు ENOC స్టేషన్లోని కార్మికులను సత్కరించారు. దుబాయ్ పోలీసులు విడుదల చేసిన వీడియోలో ఇంధనం నింపుకోవడానికి టెంపో ట్రక్ గ్యాస్ స్టేషన్లోకి రావడం, ట్రక్ స్టేషన్లోకి వచ్చే క్రమంలో ఎడమ టైరును మంటలు చుట్టుముట్టినట్లు స్పష్టంగా చూపిస్తుంది. ఇది చూసిన స్టేషన్లోని అటెండర్లు మంటలను ఆర్పే యంత్రాలతో తీవ్రంగా కృషి చేయడం కనిపించింది. పోలీసులు ధైర్యవంతులైన ఉద్యోగులను కలుసుకొని వారి ఆలోచనను అభినందించారు. వారి ముందస్తు చర్య వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని ప్రశంసించారు. లెహబాబ్ పోలీస్ స్టేషన్ డైరెక్టర్ లెఫ్టినెంట్-కల్నల్ రషీద్ ముహమ్మద్ సలేం కార్మికులను అభినందించారు. కార్మికులకు అధికారులు ధ్రువపత్రాలు అందజేశారు. అయితే, అగ్నిప్రమాదం ఎప్పుడు జరిగిందనే వివరాలను పోలీసులు వెల్లడించలేదు.
తాజా వార్తలు
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ









