కార్మికులను సత్కరించిన దుబాయ్ పోలీసులు
- September 20, 2023
యూఏఈ: దుబాయ్లోని ఒక ఇంధన స్టేషన్లోని కార్మికులను దుబాయ్ పోలీసులు సత్కరించారు. ఇటీవల ఓ వాహనం అగ్ని ప్రమాదంపై వేగంగా మరియు సమర్థవంతంగా స్పందించినందుకు పోలీసులు ENOC స్టేషన్లోని కార్మికులను సత్కరించారు. దుబాయ్ పోలీసులు విడుదల చేసిన వీడియోలో ఇంధనం నింపుకోవడానికి టెంపో ట్రక్ గ్యాస్ స్టేషన్లోకి రావడం, ట్రక్ స్టేషన్లోకి వచ్చే క్రమంలో ఎడమ టైరును మంటలు చుట్టుముట్టినట్లు స్పష్టంగా చూపిస్తుంది. ఇది చూసిన స్టేషన్లోని అటెండర్లు మంటలను ఆర్పే యంత్రాలతో తీవ్రంగా కృషి చేయడం కనిపించింది. పోలీసులు ధైర్యవంతులైన ఉద్యోగులను కలుసుకొని వారి ఆలోచనను అభినందించారు. వారి ముందస్తు చర్య వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని ప్రశంసించారు. లెహబాబ్ పోలీస్ స్టేషన్ డైరెక్టర్ లెఫ్టినెంట్-కల్నల్ రషీద్ ముహమ్మద్ సలేం కార్మికులను అభినందించారు. కార్మికులకు అధికారులు ధ్రువపత్రాలు అందజేశారు. అయితే, అగ్నిప్రమాదం ఎప్పుడు జరిగిందనే వివరాలను పోలీసులు వెల్లడించలేదు.
తాజా వార్తలు
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!









