ఖైరతాబాద్ వినాయకుడిని సందర్శించిన వెంకయ్యనాయుడు
- September 21, 2023
హైదరాబాద్: దైవభక్తితో సాంత్వన కలుగుతుందని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. గురువారం ఆయన హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మహాగణపతిని కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ భారతీయులకు దైవభక్తి, గురుభక్తి మెండు అని అని చెప్పారు. గణపతి నవరాత్రుల వంటి ఉత్సవాల వల్ల దేశ సమైక్యత మరింత పెరుగుతుందన్నారు. దేశం ఎప్పుడూ శాంతిసామరస్యాలతో వర్ధిల్లాలని, భారత్ మరింత శక్తిమంతమైన దేశంగా ఎదగాలని, భారతీయులందరూ సుఖసంతోషాలతో విలసిల్లాలని గణేశుడిని ప్రార్థించినట్లు వెల్లడించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసిన రాష్ర్టప్రభుత్వాన్ని, ఉత్సవకమిటీని వెంకయ్యనాయుడు అభినందించారు.
తాజా వార్తలు
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో మెడిసిన్ స్టాక్ పై ఆందోళన వద్దు..!!









