ఖైరతాబాద్ వినాయకుడిని సందర్శించిన వెంకయ్యనాయుడు
- September 21, 2023
హైదరాబాద్: దైవభక్తితో సాంత్వన కలుగుతుందని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. గురువారం ఆయన హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మహాగణపతిని కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ భారతీయులకు దైవభక్తి, గురుభక్తి మెండు అని అని చెప్పారు. గణపతి నవరాత్రుల వంటి ఉత్సవాల వల్ల దేశ సమైక్యత మరింత పెరుగుతుందన్నారు. దేశం ఎప్పుడూ శాంతిసామరస్యాలతో వర్ధిల్లాలని, భారత్ మరింత శక్తిమంతమైన దేశంగా ఎదగాలని, భారతీయులందరూ సుఖసంతోషాలతో విలసిల్లాలని గణేశుడిని ప్రార్థించినట్లు వెల్లడించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసిన రాష్ర్టప్రభుత్వాన్ని, ఉత్సవకమిటీని వెంకయ్యనాయుడు అభినందించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







