ఖైరతాబాద్ వినాయకుడిని సందర్శించిన వెంకయ్యనాయుడు
- September 21, 2023
హైదరాబాద్: దైవభక్తితో సాంత్వన కలుగుతుందని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. గురువారం ఆయన హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మహాగణపతిని కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ భారతీయులకు దైవభక్తి, గురుభక్తి మెండు అని అని చెప్పారు. గణపతి నవరాత్రుల వంటి ఉత్సవాల వల్ల దేశ సమైక్యత మరింత పెరుగుతుందన్నారు. దేశం ఎప్పుడూ శాంతిసామరస్యాలతో వర్ధిల్లాలని, భారత్ మరింత శక్తిమంతమైన దేశంగా ఎదగాలని, భారతీయులందరూ సుఖసంతోషాలతో విలసిల్లాలని గణేశుడిని ప్రార్థించినట్లు వెల్లడించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసిన రాష్ర్టప్రభుత్వాన్ని, ఉత్సవకమిటీని వెంకయ్యనాయుడు అభినందించారు.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







