హైదరాబాద్ విమానాశ్రయాన్ని సందర్శించిన నేషనల్ కమిషన్ వైస్ చైర్మన్
- September 22, 2023
హైదరాబాద్: కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ వైస్ చైర్మన్ అంజనా పన్వర్ సెప్టెంబర్ 21న హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించారు. ఆమెకు హైదరాబాద్ ఎయిర్ పోర్టు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి వారి యోగక్షేమాలు, పని పరిస్థితులను తెలుసుకోవడమే ఆమె పర్యటన ఉద్దేశం. ఎజెండాలో భాగంగా సఫాయి కర్మచారులను నిర్వహించే ఏజెన్సీలతో ఆమె చర్చించారు. విమానాశ్రయంలో పని పరిస్థితుల పై కార్మికులు బాహాటంగానే సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యాలయం మరియు విమానాశ్రయంలో భద్రత, లైంగిక వేధింపులు, ఆరోగ్యం మరియు పరిశుభ్రత గురించి కార్మికులకు తరచుగా అవగాహన సెషన్లు నిర్వహించాలని ఆమె సూచించారు.
తాజా వార్తలు
- సౌదీ దౌత్య శిక్షణ సంస్థ డీజీతో భారత రాయబారి విపుల్ భేటీ
- సీఎం రేవంత్ US టూర్ రద్దు..
- యూట్యూబ్కు పోటీగా చైనా ‘బిలిబిలి’ వచ్చేసింది..
- CBSE–JEE విధానం విద్యార్థుల్లో ఆలోచనా వైవిధ్యాన్ని తగ్గిస్తోంది: బిట్స్ వీసీ రామగోపాల్ రావు
- విశాఖలో బ్రిక్స్ క్రీడా మంత్రుల భేటీ.. భారత్ కీలక ప్రతిపాదనలు
- వాహనాలపై ట్రాఫిక్ జరిమానాలు పేరుకుపోతే చర్యలు తప్పవు: దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- అబుదాబిలో డిసెంబర్ 3 నుంచి ఫార్ములా-1 గ్రాండ్ ప్రిక్స్
- కొలరాడోలో NATS చెస్ టోర్నమెంట్ చక్కటి స్పందన
- ముష్రిఫ్ నేషనల్ పార్క్లో కొత్త బ్రిడ్జి ప్రారంభం..
- బహ్రెయిన్లో లోజ్ పండ్ల ధరలకు రెక్కలు..!!







