హైదరాబాద్ విమానాశ్రయాన్ని సందర్శించిన నేషనల్ కమిషన్ వైస్ చైర్మన్
- September 22, 2023
హైదరాబాద్: కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ వైస్ చైర్మన్ అంజనా పన్వర్ సెప్టెంబర్ 21న హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించారు. ఆమెకు హైదరాబాద్ ఎయిర్ పోర్టు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి వారి యోగక్షేమాలు, పని పరిస్థితులను తెలుసుకోవడమే ఆమె పర్యటన ఉద్దేశం. ఎజెండాలో భాగంగా సఫాయి కర్మచారులను నిర్వహించే ఏజెన్సీలతో ఆమె చర్చించారు. విమానాశ్రయంలో పని పరిస్థితుల పై కార్మికులు బాహాటంగానే సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యాలయం మరియు విమానాశ్రయంలో భద్రత, లైంగిక వేధింపులు, ఆరోగ్యం మరియు పరిశుభ్రత గురించి కార్మికులకు తరచుగా అవగాహన సెషన్లు నిర్వహించాలని ఆమె సూచించారు.
తాజా వార్తలు
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!
- యూఏఈలో భారీగా డ్రగ్స్ సీజ్..13మంది అరెస్టు..!!
- ప్రోగ్రామింగ్ లోపం..సౌదీలో హ్యుందాయ్ వెహికిల్స్ రీకాల్..!!
- మే 7వరకు ఒమన్ లో సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు..!!
- కువైట్లో ట్రాఫిక్ మార్పులు: ఐదవ రింగ్ రోడ్డుపై 14 రోజుల పాటు లేన్లు మూసివేత
- NTPCలో 250 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
- దుబాయ్లో ప్రాపర్టీ ఇన్వెస్టర్లకు రెండు సంవత్సరాల రెసిడెన్సీ వీసా నిబంధనల్లో మార్పులు
- మేలో బ్యాంక్ హాలిడేస్ ఫుల్ లిస్ట్..!









