హైదరాబాద్ విమానాశ్రయాన్ని సందర్శించిన నేషనల్ కమిషన్ వైస్ చైర్మన్
- September 22, 2023
హైదరాబాద్: కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ వైస్ చైర్మన్ అంజనా పన్వర్ సెప్టెంబర్ 21న హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించారు. ఆమెకు హైదరాబాద్ ఎయిర్ పోర్టు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి వారి యోగక్షేమాలు, పని పరిస్థితులను తెలుసుకోవడమే ఆమె పర్యటన ఉద్దేశం. ఎజెండాలో భాగంగా సఫాయి కర్మచారులను నిర్వహించే ఏజెన్సీలతో ఆమె చర్చించారు. విమానాశ్రయంలో పని పరిస్థితుల పై కార్మికులు బాహాటంగానే సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యాలయం మరియు విమానాశ్రయంలో భద్రత, లైంగిక వేధింపులు, ఆరోగ్యం మరియు పరిశుభ్రత గురించి కార్మికులకు తరచుగా అవగాహన సెషన్లు నిర్వహించాలని ఆమె సూచించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం
- ఇరాన్ గడపకు పాక్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్..
- IPL 2026: లక్నో పై బెంగళూరు ఘన విజయం
- హర్మూజ్ దిగ్బంధనం పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
- కుప్పకూలిన 2వేల కోట్ల విలువైన అమెరికా నిఘా డ్రోన్
- ఎయిరిండియాకు రూ.22వేల కోట్ల భారీ నష్టం
- యూఏఈ లాటరీ తొలి రిటైల్ షాపు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో కల్చరల్ ఇవెంట్స్ కు ఆదరణ..!!
- ఖతార్ లో పలు ట్రావెల్ ఏజెన్సీలపై చర్యలు..!!
- ప్రైవేట్ పాఠశాలల్లో ఉద్యోగ కోతలు..!!









