హైదరాబాద్ విమానాశ్రయాన్ని సందర్శించిన నేషనల్ కమిషన్ వైస్ చైర్మన్
- September 22, 2023
హైదరాబాద్: కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ వైస్ చైర్మన్ అంజనా పన్వర్ సెప్టెంబర్ 21న హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించారు. ఆమెకు హైదరాబాద్ ఎయిర్ పోర్టు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి వారి యోగక్షేమాలు, పని పరిస్థితులను తెలుసుకోవడమే ఆమె పర్యటన ఉద్దేశం. ఎజెండాలో భాగంగా సఫాయి కర్మచారులను నిర్వహించే ఏజెన్సీలతో ఆమె చర్చించారు. విమానాశ్రయంలో పని పరిస్థితుల పై కార్మికులు బాహాటంగానే సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యాలయం మరియు విమానాశ్రయంలో భద్రత, లైంగిక వేధింపులు, ఆరోగ్యం మరియు పరిశుభ్రత గురించి కార్మికులకు తరచుగా అవగాహన సెషన్లు నిర్వహించాలని ఆమె సూచించారు.
తాజా వార్తలు
- బాసర సరస్వతి అమ్మవారి ఆలయ సమీపంలో పేలుడు శబ్దాలు..
- యూకేని భయపెడుతున్న ‘100 రోజుల దగ్గు’..
- 100 మంది దుబాయ్ డ్రైవర్లకు 50,000 దిర్హామ్ల జరిమానా
- మస్కట్ విమానాశ్రయంలో ఫ్రీ జోన్ ఏర్పాటుకు ఒప్పందం
- ప్రముఖ 'హిడెన్' బీచ్ తాత్కాలికంగా మూసివేత
- అబ్దల్లిలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు ఈజిప్టు ప్రవాసులు మృతి
- సైబర్ సెక్యూరిటీలో గ్లోబల్ సహకారానికి బహ్రెయిన్ పిలుపు
- సేవల్లో నిర్లక్ష్యం.. అనేక ఉమ్రా కంపెనీల లైసెన్స్లు రద్దు
- కర్ణాటకలో ఘోర ప్రమాదం..కారు చెరువులో పడి నలుగురు మృతి
- కేసీఆర్ని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి