కల్తీ ఉత్పత్తుల తయారీ..నివాసితుడికి 2 సంవత్సరాల జైలు, SR20000 జరిమానా
- September 22, 2023
రియాద్: కల్తీ వెటర్నరీ ప్రిపరేషన్ల తయారీ కేసులో దోషిగా తేలిన ఒక ప్రవాస వ్యక్తికి దమ్మామ్లోని ప్రత్యేక న్యాయస్థానం రెండు సంవత్సరాల జైలు శిక్ష, SR20000 జరిమానా విధించింది. మోసం చేయాలనే ఉద్దేశ్యంతో వెటర్నరీ ప్రిపరేషన్ల కంటైనర్ల కోసం ప్యాకెట్లను తయారు చేయడం, ముద్రించడం వంటి కేసులో కూడా అతను దోషిగా తేలారు. సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA)కి చెందిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు దమ్మామ్ నగరంలో తనిఖీలు చేపట్టింది. అదే సమయంలో థర్మల్ మ్యాప్లు, టెంపరేచర్ గేజ్లు లేకుండా అధిక ఉష్ణోగ్రతతో శీతలీకరించని కారులో వెటర్నరీ పరికరాలను రవాణా చేసే క్రమంలో నిందితుడు పట్టుబడ్డాడు. రెగ్యులేటరీ లైసెన్సులను పొందకుండానే వాణిజ్యం కోసం ఖాళీ కంటైనర్లను కొనుగోలు చేయడంతో పాటు సాంకేతిక నిబంధనలను వారు పాటించలేదని అధికారులు గుర్తించారు. అవసరమైన రెగ్యులేటరీ లైసెన్సులు లేకుండా ఏదైనా పశువైద్య పరికరాలు, ఉత్పత్తులను తయారీ చేయడం, మార్కెటింగ్ చేయడం గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాలలోని వెటర్నరీ ఉత్పత్తుల చట్టం కింద శిక్షార్హమైన కేసు. ఈ తరహా మోసాలను గుర్తిస్తే 19999కి కాల్ చేయడం ద్వారా లేదా అప్లికేషన్ ద్వారా నివేదించాలని ప్రజలకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







