కల్తీ ఉత్పత్తుల తయారీ..నివాసితుడికి 2 సంవత్సరాల జైలు, SR20000 జరిమానా
- September 22, 2023
రియాద్: కల్తీ వెటర్నరీ ప్రిపరేషన్ల తయారీ కేసులో దోషిగా తేలిన ఒక ప్రవాస వ్యక్తికి దమ్మామ్లోని ప్రత్యేక న్యాయస్థానం రెండు సంవత్సరాల జైలు శిక్ష, SR20000 జరిమానా విధించింది. మోసం చేయాలనే ఉద్దేశ్యంతో వెటర్నరీ ప్రిపరేషన్ల కంటైనర్ల కోసం ప్యాకెట్లను తయారు చేయడం, ముద్రించడం వంటి కేసులో కూడా అతను దోషిగా తేలారు. సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA)కి చెందిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు దమ్మామ్ నగరంలో తనిఖీలు చేపట్టింది. అదే సమయంలో థర్మల్ మ్యాప్లు, టెంపరేచర్ గేజ్లు లేకుండా అధిక ఉష్ణోగ్రతతో శీతలీకరించని కారులో వెటర్నరీ పరికరాలను రవాణా చేసే క్రమంలో నిందితుడు పట్టుబడ్డాడు. రెగ్యులేటరీ లైసెన్సులను పొందకుండానే వాణిజ్యం కోసం ఖాళీ కంటైనర్లను కొనుగోలు చేయడంతో పాటు సాంకేతిక నిబంధనలను వారు పాటించలేదని అధికారులు గుర్తించారు. అవసరమైన రెగ్యులేటరీ లైసెన్సులు లేకుండా ఏదైనా పశువైద్య పరికరాలు, ఉత్పత్తులను తయారీ చేయడం, మార్కెటింగ్ చేయడం గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాలలోని వెటర్నరీ ఉత్పత్తుల చట్టం కింద శిక్షార్హమైన కేసు. ఈ తరహా మోసాలను గుర్తిస్తే 19999కి కాల్ చేయడం ద్వారా లేదా అప్లికేషన్ ద్వారా నివేదించాలని ప్రజలకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







