యూఏఈ ఐఫోన్ 15: ఆపిల్ స్టోర్ కు పోటెత్తిన కొనుగోలుదారులు
- September 22, 2023
యూఏఈ: శుక్రవారం తెల్లవారుజామున వేలాది మంది ఐఫోన్ ప్రియులు ఐఫోన్ 15 ను సొంతం చేసుకునేందుకు దుబాయ్ మాల్ ముందు బారులు తీరారు. మొదటి కొద్దిమంది కస్టమర్లు సరికొత్త ఐఫోన్ 15ను సొంతం చేసుకోగలిగారు. గంటల తరబడి క్యూలో వేచి ఉండి ఫోన్ ను కొనుగోలు చేసిన పలువురు సంతోషం వ్యక్తం చేశారు. ఆపిల్ స్మార్ట్ఫోన్ను పొందేందుకు నివాసితులు దేశంలోని అతిపెద్ద ఆపిల్ స్టోర్ అయిన దుబాయ్ మాల్ వద్ద గంటల కొద్ది క్యూలో నిల్చున్నారు. దుబాయ్ మాల్ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. క్యూలను అదుపు చేసేందుకు భద్రతా సిబ్బందిని నియమించారు. మాల్లోని రెండో అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వరకు జనం పెద్ద క్యూలలో ఏర్పాటు చేశారు. మాల్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







