యూఏఈ ఐఫోన్ 15: ఆపిల్ స్టోర్ కు పోటెత్తిన కొనుగోలుదారులు
- September 22, 2023
యూఏఈ: శుక్రవారం తెల్లవారుజామున వేలాది మంది ఐఫోన్ ప్రియులు ఐఫోన్ 15 ను సొంతం చేసుకునేందుకు దుబాయ్ మాల్ ముందు బారులు తీరారు. మొదటి కొద్దిమంది కస్టమర్లు సరికొత్త ఐఫోన్ 15ను సొంతం చేసుకోగలిగారు. గంటల తరబడి క్యూలో వేచి ఉండి ఫోన్ ను కొనుగోలు చేసిన పలువురు సంతోషం వ్యక్తం చేశారు. ఆపిల్ స్మార్ట్ఫోన్ను పొందేందుకు నివాసితులు దేశంలోని అతిపెద్ద ఆపిల్ స్టోర్ అయిన దుబాయ్ మాల్ వద్ద గంటల కొద్ది క్యూలో నిల్చున్నారు. దుబాయ్ మాల్ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. క్యూలను అదుపు చేసేందుకు భద్రతా సిబ్బందిని నియమించారు. మాల్లోని రెండో అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వరకు జనం పెద్ద క్యూలలో ఏర్పాటు చేశారు. మాల్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









