యూఏఈ ఐఫోన్ 15: ఆపిల్ స్టోర్ కు పోటెత్తిన కొనుగోలుదారులు
- September 22, 2023
యూఏఈ: శుక్రవారం తెల్లవారుజామున వేలాది మంది ఐఫోన్ ప్రియులు ఐఫోన్ 15 ను సొంతం చేసుకునేందుకు దుబాయ్ మాల్ ముందు బారులు తీరారు. మొదటి కొద్దిమంది కస్టమర్లు సరికొత్త ఐఫోన్ 15ను సొంతం చేసుకోగలిగారు. గంటల తరబడి క్యూలో వేచి ఉండి ఫోన్ ను కొనుగోలు చేసిన పలువురు సంతోషం వ్యక్తం చేశారు. ఆపిల్ స్మార్ట్ఫోన్ను పొందేందుకు నివాసితులు దేశంలోని అతిపెద్ద ఆపిల్ స్టోర్ అయిన దుబాయ్ మాల్ వద్ద గంటల కొద్ది క్యూలో నిల్చున్నారు. దుబాయ్ మాల్ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. క్యూలను అదుపు చేసేందుకు భద్రతా సిబ్బందిని నియమించారు. మాల్లోని రెండో అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వరకు జనం పెద్ద క్యూలలో ఏర్పాటు చేశారు. మాల్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
- బాసర సరస్వతి అమ్మవారి ఆలయ సమీపంలో పేలుడు శబ్దాలు..
- యూకేని భయపెడుతున్న ‘100 రోజుల దగ్గు’..
- 100 మంది దుబాయ్ డ్రైవర్లకు 50,000 దిర్హామ్ల జరిమానా
- మస్కట్ విమానాశ్రయంలో ఫ్రీ జోన్ ఏర్పాటుకు ఒప్పందం
- ప్రముఖ 'హిడెన్' బీచ్ తాత్కాలికంగా మూసివేత
- అబ్దల్లిలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు ఈజిప్టు ప్రవాసులు మృతి
- సైబర్ సెక్యూరిటీలో గ్లోబల్ సహకారానికి బహ్రెయిన్ పిలుపు
- సేవల్లో నిర్లక్ష్యం.. అనేక ఉమ్రా కంపెనీల లైసెన్స్లు రద్దు
- కర్ణాటకలో ఘోర ప్రమాదం..కారు చెరువులో పడి నలుగురు మృతి
- కేసీఆర్ని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి