బిగ్‌బాస్‌లో ఏం జరుగుతోందంటే.!

- September 22, 2023 , by Maagulf
బిగ్‌బాస్‌లో ఏం జరుగుతోందంటే.!

ఈ సారి ‘ఉల్టా ఫుల్టా’ అనే కాన్సెప్ట్‌తో బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. గత సీజన్లతో పోల్చితే ఈ సీజన్ కాస్త ఇంట్రెస్టింగ్‌గానే సాగుతోంది. హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్లు ఎవ్వరూ కన్‌ఫామ్ కంటెస్టెంట్లు కారంటూ బిగ్‌బాస్ చెప్పాడు.
వారి వారి టాస్క్ పర్‌‌ఫామెన్సెస్ ద్వారా ఇప్పుడిప్పుడే హౌస్‌లో శాశ్వత స్థానాన్ని దక్కించుకుంటున్నారు. అలా మొదటి కంటెస్టెంట్‌గా ఆట సందీప్, రెండో కంటెస్టెంట్‌గా నటుడు శివాజీ కన్‌పామ్ అయ్యారు. ఇక మూడో కంటెస్టెంట్ కోసం పోటీ నడుస్తోంది.
కంటెండర్లుగా శోభా రెడ్డి, యావర్, ప్రియాంక జైన్ ఎన్నుకోబడ్డారు. వీరిలోంచి ఎవరు మూడో కంటెస్టెంట్‌గా గెలుస్తారో చూడాలి మరి.
ఇదిలా వుంటే, తొలి కంటెస్టెంట్ అయిన సందీప్‌ని అన్ని టాస్కులకీ సంచాలకునిగా నియమిస్తున్నాడు బిగ్‌బాస్. సంచాలకుడు అంటే ఎలాంటి పార్షియాలిటీ చూపించకూడదు. కానీ, తనదైన పార్షియాలిటీతో లేటెస్ట్ ఎపిసోడ్‌లో సందీప్, మరో కంటెండర్ కావాల్సిన గౌతమ్‌ కృష్ణకి ఆ అవకాశాన్ని రానీయకుండా చేశాడు. ఆ స్థానంలోనే శోభా శెట్టి కన్‌ఫామ్ అయ్యింది. 
అంతకు ముందు జరిగిన యావర్ టాస్క్‌లోనూ సందీప్ అదే ప్రయత్నం చేయబోగా.. సెకండ్ సంచాలకుడిగా వ్యవహరించిన శివాజీ అడ్డుపడడంతో ప్రిన్స్ యావర్ సేఫ్ అయ్యాడు. పాపం గౌతమ్ మాత్రం బలైపోయాడు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com