బిగ్బాస్లో ఏం జరుగుతోందంటే.!
- September 22, 2023
ఈ సారి ‘ఉల్టా ఫుల్టా’ అనే కాన్సెప్ట్తో బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. గత సీజన్లతో పోల్చితే ఈ సీజన్ కాస్త ఇంట్రెస్టింగ్గానే సాగుతోంది. హౌస్లోకి వెళ్లిన కంటెస్టెంట్లు ఎవ్వరూ కన్ఫామ్ కంటెస్టెంట్లు కారంటూ బిగ్బాస్ చెప్పాడు.
వారి వారి టాస్క్ పర్ఫామెన్సెస్ ద్వారా ఇప్పుడిప్పుడే హౌస్లో శాశ్వత స్థానాన్ని దక్కించుకుంటున్నారు. అలా మొదటి కంటెస్టెంట్గా ఆట సందీప్, రెండో కంటెస్టెంట్గా నటుడు శివాజీ కన్పామ్ అయ్యారు. ఇక మూడో కంటెస్టెంట్ కోసం పోటీ నడుస్తోంది.
కంటెండర్లుగా శోభా రెడ్డి, యావర్, ప్రియాంక జైన్ ఎన్నుకోబడ్డారు. వీరిలోంచి ఎవరు మూడో కంటెస్టెంట్గా గెలుస్తారో చూడాలి మరి.
ఇదిలా వుంటే, తొలి కంటెస్టెంట్ అయిన సందీప్ని అన్ని టాస్కులకీ సంచాలకునిగా నియమిస్తున్నాడు బిగ్బాస్. సంచాలకుడు అంటే ఎలాంటి పార్షియాలిటీ చూపించకూడదు. కానీ, తనదైన పార్షియాలిటీతో లేటెస్ట్ ఎపిసోడ్లో సందీప్, మరో కంటెండర్ కావాల్సిన గౌతమ్ కృష్ణకి ఆ అవకాశాన్ని రానీయకుండా చేశాడు. ఆ స్థానంలోనే శోభా శెట్టి కన్ఫామ్ అయ్యింది.
అంతకు ముందు జరిగిన యావర్ టాస్క్లోనూ సందీప్ అదే ప్రయత్నం చేయబోగా.. సెకండ్ సంచాలకుడిగా వ్యవహరించిన శివాజీ అడ్డుపడడంతో ప్రిన్స్ యావర్ సేఫ్ అయ్యాడు. పాపం గౌతమ్ మాత్రం బలైపోయాడు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం
- ఇరాన్ గడపకు పాక్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్..
- IPL 2026: లక్నో పై బెంగళూరు ఘన విజయం
- హర్మూజ్ దిగ్బంధనం పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
- కుప్పకూలిన 2వేల కోట్ల విలువైన అమెరికా నిఘా డ్రోన్
- ఎయిరిండియాకు రూ.22వేల కోట్ల భారీ నష్టం
- యూఏఈ లాటరీ తొలి రిటైల్ షాపు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో కల్చరల్ ఇవెంట్స్ కు ఆదరణ..!!
- ఖతార్ లో పలు ట్రావెల్ ఏజెన్సీలపై చర్యలు..!!
- ప్రైవేట్ పాఠశాలల్లో ఉద్యోగ కోతలు..!!









