ఫార్మసీ ప్రవేశాలకు తదిదశ నోటిఫికేషన్ విడుదల
- September 23, 2023
28వ తేదీ సీట్ట కేటాయంపు: చదలవాడ నాగరాణి
విజయవాడ: ఫార్మసీ ప్రవేశాలకు నిర్దేశించిన ఎపి ఈసెట్ తుదిదశ షేడ్యూలును సాంకేతిక విద్యా శాఖ కమీషనర్, అడ్మిషన్ల కన్వీనర్ చదలవాడ నాగరాణి శనివారం విడుదల చేసారు. తాజా నోటిఫికేషన్ ను అనుసరించి సెప్టెంబరు 25, 26 తేదీలలో విద్యార్ధులు ఆన్ లైన్ లో రిజిస్టేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు చేయవలసి ఉంది. సెప్టెంబరు 25 నుండి 27 వరకు ఆన్ లైన్ ద్వారా ధృవీకరణ పత్రాల వెరిఫికేషన్, ఆఫ్షన్ల ఎంపికకు అవకాశం కల్పించారు. ఎవరైన విద్యార్ధులు ఆఫ్షన్లను మార్చుకోదలిస్తే 27వ తేదీ మాత్రమే అవకాశం ఉంటుంది. 28వ తేదీ అయా కళాశాలల్లో రిజర్వేషన్లను అనుసరించి సీట్ల కేటాయింపు ఉంటుంది. 29,30 తేదీలలో విద్యార్ధులు తమకు కేటాయించిన కళాశాలల్లో వ్యక్తిగతంగా రిపోర్టు చేయాలి. ఇప్పటికే క్లాసులు ప్రారంభం అయినందున విధ్యార్దులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఫార్మసీ అడ్మిషన్లను పొందాలని కన్వీనర్ నాగరాణి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









