ఫార్మసీ ప్రవేశాలకు తదిదశ నోటిఫికేషన్ విడుదల
- September 23, 2023
28వ తేదీ సీట్ట కేటాయంపు: చదలవాడ నాగరాణి
విజయవాడ: ఫార్మసీ ప్రవేశాలకు నిర్దేశించిన ఎపి ఈసెట్ తుదిదశ షేడ్యూలును సాంకేతిక విద్యా శాఖ కమీషనర్, అడ్మిషన్ల కన్వీనర్ చదలవాడ నాగరాణి శనివారం విడుదల చేసారు. తాజా నోటిఫికేషన్ ను అనుసరించి సెప్టెంబరు 25, 26 తేదీలలో విద్యార్ధులు ఆన్ లైన్ లో రిజిస్టేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు చేయవలసి ఉంది. సెప్టెంబరు 25 నుండి 27 వరకు ఆన్ లైన్ ద్వారా ధృవీకరణ పత్రాల వెరిఫికేషన్, ఆఫ్షన్ల ఎంపికకు అవకాశం కల్పించారు. ఎవరైన విద్యార్ధులు ఆఫ్షన్లను మార్చుకోదలిస్తే 27వ తేదీ మాత్రమే అవకాశం ఉంటుంది. 28వ తేదీ అయా కళాశాలల్లో రిజర్వేషన్లను అనుసరించి సీట్ల కేటాయింపు ఉంటుంది. 29,30 తేదీలలో విద్యార్ధులు తమకు కేటాయించిన కళాశాలల్లో వ్యక్తిగతంగా రిపోర్టు చేయాలి. ఇప్పటికే క్లాసులు ప్రారంభం అయినందున విధ్యార్దులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఫార్మసీ అడ్మిషన్లను పొందాలని కన్వీనర్ నాగరాణి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత







