తెలంగాణలో విషాదం..8 మంది పై పిడుగుపాటు
- September 26, 2023
తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజులుగా వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం ఖమ్మం జిల్లాలో విషాదం నింపాయి. ఖమ్మం జిల్లా తిరుమలాయపల్లి (మం) దమ్మాయిగూడెంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న 8 మంది కూలీలపై పిడుగు పడింది.
ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడడంతో కూలీలంతా పక్కనే ఉన్న వేప చెట్టు కిందకు చేరారు. ఇంతలోనే భారీ శబ్దంతో పిడుగు ఒక్కసారిగా పడడంతో 8 మంది కూలీలు పిడుగుపాటుకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పరిస్థితి విషమం ఉండగా.. మిగతా వారికి గాయాలు అయినట్లు తెలిసింది. ప్రస్తుతం వీరంతా ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









